Prakash raj: జై షా క్రికెట్ రంగంలోనే ఆల్‌రౌండ‌ర్

prakash raj satire on jay shah

Prakash Raj: విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాష్ రాజ్‌.. కేంద్ర మంత్రి అమిత్ షా కుమారుడు, ఐసీసీ చీఫ్ జై షాపై సెటైర్ వేసారు. ప్ర‌కాష్ రాజ్‌కు భార‌తీయ జ‌న‌తా పార్టీ అంటే ఒళ్లుమంట‌. ఆ పార్టీ కుల‌, మ‌త విభేదాలు సృష్టించి మ‌త‌త‌త్వ రాజ‌కీయాల‌కు పాల్ప‌డుతుంద‌ని ప్ర‌కాష్ రాజ్ ఎప్పుడూ ఆరోపిస్తూ ఉంటారు. మాట్లాడితే కుటుంబ రాజ‌కీయాలు అని నోరు పారేసుకునే భార‌తీయ జ‌న‌తా పార్టీ ఈరోజు.. అమిత్ షా కుమారుడు జై షాకు ఎలాంటి అనుభవం లేకుండానే క్రికెట్ రంగంలో ఎలా ఎదుగుతున్నాడ‌ని ప్ర‌కాష్ రాజ్ మండిప‌డ్డారు. ఐసీసీ ఛైర్మ‌న్ అయ్యే స్థాయి ఎంతో మందికి ఉన్న‌ప్ప‌టికీ అస‌లు ఏనాడూ క్రికెట్ ఆడ‌ని జై షాకు ఎలా ద‌క్కింద‌ని ప్ర‌శ్నించారు.

క్రికెట్ రంగంలో గొప్ప లెజెండ్, బౌలర్, బ్యాట్స్‌మెన్, వికెట్ కీప‌ర్, ఫీల్డ‌ర్.. మొత్తానికి క్రికెట్‌లో ఆల్‌రౌండ‌ర్ అయిన ఐసీసీ ఛైర్మ‌న్‌కు వంద‌నాలు అంటూ కామెంట్ చేసారు. అంటే క్రికెట్‌లో ఏ ఒక్క విష‌యంలోనూ అనుభ‌వం లేని జై షా యునానిమ‌స్‌గా ఐసీసీ ఛైర్మ‌న్‌గా ఎంపిక‌వ‌డం ఏంటి అని ప్ర‌కాష్ రాజ్ సెటైర్ వేసార‌న్న‌మాట‌.