Champions Trophy 2025: BCCI రాత‌పూర్వ‌కంగా ఇవ్వాలి.. అప్పుడే ఒప్పుకుంటాం

pcb wants bcci to give written statement to icc

 

Champions Trophy 2025: 2025లో జ‌ర‌గ‌నున్న ICC ఛాంపియ‌న్‌షిప్ ట్రోఫీ మ్యాచ్‌లో భాగంగా టీమిండియా పాకిస్థాన్‌కు ప్ర‌యాణించ‌డం కుద‌ర‌ద‌ని BCCI వెల్ల‌డించిన సంగ‌తి తెలిసిందే. అయితే ఒక‌వేళ భారత ప్ర‌భుత్వం అనుమ‌తి ఇస్తే అప్పుడు పాకిస్థాన్ వెళ్లి ట్రోఫీ మ్యాచ్ ఆడేందుకు త‌మ‌కు అభ్యంత‌రం లేద‌ని.. ఒక‌వేళ అనుమ‌తి ఇవ్వ‌క‌పోతే మాత్రం ICC నుంచి త‌ప్పుకుంటామ‌ని బీసీసీఐ తెలిపింది.

అయితే.. ఒక‌వేళ భార‌త ప్ర‌భుత్వం అనుమ‌తి ఇవ్వ‌క‌పోతే.. ఈ విష‌యాన్ని బీసీసీఐ పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు రాత‌పూర్వ‌కంగా తెలియ‌జేయాలని అప్పుడే భార‌త్ చెప్తోంది నిజం అని న‌మ్ముతామ‌ని పాక్ బోర్డు తెలిపింది.