Pakistan: భార‌త్‌కు వ‌చ్చి ఆడి మేమేంటో చూపించాం.. మేం సింహాలం

Pakistan player challenge to team india

Pakistan: 2025 ఐసీసీ ఛాంపియ‌న్‌షిప్ టోర్న‌మెంట్‌లో టీమిండియా ఆడ‌బోతోందా లేదా అనేది ఇంకా సందేహంగానే ఉంది. ఎందుకంటే ఈ టోర్న‌మెంట్‌ను పాకిస్థాన్‌లోని లాహోర్ నిర్వ‌హించ‌నున్నారు. ఇరు దేశాల మ‌ధ్య రాజ‌కీయ ప‌రిణామాల దృష్ట్యా టీమిండియా పాకిస్థాన్‌కు వెళ్లి ఆడే స‌మస్యే లేద‌ని బీసీసీఐ ప్ర‌క‌టించేసింది. ఇందుకు పాకిస్థాన్ కంట్రోల్ బోర్డు మాత్రం ఒప్పుకోవ‌డంలేదు. టీమిండియా ఈ టోర్న‌మెంట్ లాహోర్‌లోనే ఆడాల‌ని లేక‌పోతే టోర్న‌మెంట్ నుంచి త‌ప్పుకోవాల‌ని డిమాండ్ చేస్తోంది.

ఈ నేప‌థ్యంలో పాకిస్థానీ క్రికెట‌ర్ త‌న్వీర్ అహ్మ‌ద్ రెచ్చ‌గొట్టే వ్యాఖ్య‌లు చేసాడు. “” మీ అడ్డాకు వ‌చ్చి మీతోనే త‌ల‌ప‌డ్డాం. సింహాలం మేం. కానీ మీకు మాత్రం ఆ ధైర్యం లేదు. ప్ర‌తిసారీ పాకిస్థానీ క్రికెట‌ర్లే ఇండియాకు వెళ్లి ఆడేసి వ‌స్తున్నారు. టీమిండియా మాత్రం రావ‌డంలేదు. మీరు వ‌స్తానంటే భారీ భ‌ద్ర‌తా ఏర్పాటు చేస్తాం. మీ ఊ అనండి చాలు. మిగ‌తాదంతా మేం చూసుకుంటాం. మ‌రి ఆ ద‌మ్ముందా? “” అంటూ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసాడు.