6.3 శాతానికి పెరిగిన IPL విలువ‌.. ప‌డిపోయిన MI బ్రాండ్

mumbai indians lost it's brand value in ipl

 

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (IPL) విలువ గ‌తేడాదితో పోలిస్తే 6.3 శాతానికి పెరిగింది. 2023 వ‌ర‌కు ఇండియ‌న్ ప్రీమియర్ లీగ్ విలువ రూ.28 వేల కోట్లు ఉండ‌గా.. ఈ ఏడాది రూ.135,000 కోట్ల‌కు పెరిగింది. ఈ ఏడాది నుంచి 2028 వ‌ర‌కు ఐపీఎల్ ట్రోఫీ స్పాన్స‌ర్‌షిప్‌ టాటా సంస్థ నుంచి రానుంది. టాటా నుంచి వ‌చ్చే స్పాన్స‌ర్‌షిప్ ధ‌ర రూ.2,500 కోట్లు. గ‌తేడాదితో పోలిస్తే ఇది 50% ఎక్కువ‌.

అత్య‌ధిక బ్రాండ్ వ్యాల్యూ ఉన్న టీమ్స్ ఇవే

టాప్ 1లో చెన్నై సూప‌ర్ కింగ్స్ నిలిచింది. ఈ టీం బ్రాండ్ విలువ 9% పెరిగింది

టాప్ 2లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు ఉంది.

టాప్ 3లో విన్న‌ర్ క‌ల‌క‌త్తా నైట్ రైడ‌ర్స్ ఉంది.

ఇక టాప్ 4 స్థానానికే ముంబై ఇండియ‌న్స్ ప‌రిమితమైంది. గ‌తేడాదితో పోలిస్తే ముంబై ఇండియ‌న్స్ బ్రాండ్ వ్యాల్యూని కోల్పోయింది.