MS Dhoni: ఆగ‌స్ట్ 15న ధోనీ రిటైర్మెంట్ ప్ర‌క‌ట‌న‌

ms dhoni to announce his retirement on independence day

MS Dhoni: మహేంద్ర సింగ్ ధోనీ 2025 ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ ఆడ‌తాడా లేదా అనే సందేహాల‌కు ఇంకా ఫుల్ స్టాప్ ప‌డ‌లేదు. ఒక‌వేళ ధోనీ 2025 ఐపీఎల్‌లో ఆడాల‌నుకుంటే ఆయ‌న్ను అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా తీసుకోవాల‌ని రిక్వెస్ట్ పెట్టారు. ఈ నేప‌థ్యంలో ఓ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం నెట్టింట్లో ట్రెండ్ అవుతోంది. ఈ నెల ఆగ‌స్ట్ 15న స్వాతంత్ర దినోత్స‌వం సంద‌ర్భంగా ధోనీ త‌న రిటైర్మెంట్‌ను ప్ర‌కటించే అవ‌కాశాలు ఉన్నాయ‌ట‌. ఎందుకంటే ఎందుకంటే 2020 ఆగ‌స్ట్ 15న ధోనీ అంత‌ర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. 2019 ICC ODI వ‌ర‌ల్డ్ క‌ప్‌లో ధోనీ ఆడాడు. కానీ ఆ క‌ప్‌లో టీమిండియా ఓడిపోయింది. దాంతో రేపు 15 స్వాతంత్ర్య దినోత్స‌వం రోజున ఐపీఎల్ నుంచి ధోనీ రిటైర్మెంట్ ప్ర‌క‌టించే అవ‌కాశాలు ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాయ‌ని అంటున్నారు.