Mohammad Haris: ఇక పాక్ ఇండియా గురించి మాట్లాడ‌దు

Mohammad Haris says pakistan players are not allowed to talk about india

Mohammad Haris: త్వ‌ర‌లో ACC మెన్స్ T20 ఆసియా క‌ప్ జ‌ర‌గ‌నుంది. అక్టోబ‌ర్ 19న పాకిస్థాన్ ఏ టీం ఇండియ‌న్ ఏ టీంతో త‌ల‌ప‌డ‌నుంది. ఈ నేప‌థ్యంలో పాక్ ఏ కెప్టెన్ మ‌హ్మ‌ద్ హ్యారిస్ కీల‌క వ్యాఖ్య‌లు చేసారు. డ్రెస్సింగ్ రూంలో టీమిండియా గురించి పాక్ ఆట‌గాళ్లు మాట్లాడ‌కూడ‌దు అని తాను రూల్ పెట్టిన‌ట్లు తెలిపారు. ఈ రూల్ వ‌ల్ల యువ ఆట‌గాళ్ల‌పై ఒత్తిడి ఉంద‌ని అన్నారు. కేవ‌లం ఇండియాపైనే కాకుండా ఒమ‌న్, UAEల‌తో జ‌రిగే మ్యాచ్‌లపై కూడా ఫోక‌స్ చేస్తున్న‌ట్లు తెలిపారు. అక్టోబ‌ర్ 18 నుంచి మొదలు కానున్న ఈ ఆసియా క‌ప్ అక్టోబ‌ర్ 27న ముగియ‌నుంది.