“కోహ్లీ వ‌ర‌ల్డ్ క‌ప్ ఆడ‌తాడు కానీ రోహిత్ క‌ళ్లు తిరిగి ప‌డిపోతాడు”

krishnamachari srikanth shocking comments on rohit sharma playing world cup

Virat Kohli: 2027లో జ‌ర‌గ‌బోయే ప్ర‌పంచ క‌ప్‌లో విరాట్ కోహ్లీ బాగా ఆడ‌తాడు కానీ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ మాత్రం క‌ళ్లు తిరిగి ప‌డిపోతాడ‌ని షాకింగ్ కామెంట్స్ చేసారు లెజండ‌రీ క్రికెట‌ర్ కృష్ణ‌మ‌చారి శ్రీకాంత్. 2027 నాటికి కోహ్లీకి 39, రోహిత్‌కి 40 వ‌స్తాయి. అందుకే ఇప్ప‌టినుంచే టీమిండియా కోచ్ గౌత‌మ్ గంభీర్ వ‌ర‌ల్డ్ క‌ప్ కోసం ఫిట్‌నెస్ మెయింటైన్ చేస్తూ ఉండండి అని హెచ్చ‌రిస్తున్నాడు.

ఫిట్‌నెస్ విష‌యంలో కోహ్లీని మించిన ఆట‌గాడు లేడు. రోహిత్ ఫిట్‌గా ఉన్న‌ప్ప‌టికీ 2027 నాటికి ఎలా ఉంటాడో అనే ఆందోళ‌న ఇప్ప‌టినుంచే ఉంద‌ని శ్రీకాంత్ అన్నారు. ద‌క్షిణాఫ్రికాలో జ‌ర‌గ‌బోయే ప్ర‌పంచ క‌ప్ మ్యాచ్‌లో కోహ్లీ బాగా ఆడ‌తాడ‌న్న న‌మ్మ‌కం ఉంది కానీ క‌చ్చితంగా రోహిత్ శ‌ర్మ మైదానంలోనే క‌ళ్లు తిరిగిప‌డిపోతాడు అని ఆయ‌న కామెంట్ చేయ‌డం వైర‌ల్‌గా మారింది. రోహిత్ విష‌యంలో గంభీర్ ఎక్కువ ఆశ‌లు పెట్టుకున్న‌ట్లు అనిపిస్తోంద‌ని కృష్ణ‌మచారి శ్రీకాంత్ అభిప్రాయ‌ప‌డ్డారు.