Siddipet: TTD 30 కోట్ల సూప‌ర్ ప్లాన్

Siddipet: సిద్ధిపేట్ వాసుల‌కు శుభ‌వార్త‌. తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (ttd) వారు శ్రీవారి లాంటి ఆల‌యాన్ని సిద్ధిపేట‌లో (siddipet) నిర్మించ‌బోతున్నారు. ఇందుకోసం రూ.30 కోట్లు ఖ‌ర్చు చేయ‌బోతున్నారు. ఈ విష‌యాన్ని BRS మంత్రి హ‌రీష్ రావు తెలిపారు. ఇందుకోసం తెలంగాణ ప్ర‌భుత్వం కేటాయించిన స్థ‌లాన్ని TTD అధికారులు ప‌రిశీలించారు. టెంపుల్ డిజైన్ కూడా ఫైన‌లైజ్ అయిపోయింది. ఇక TTD ఇంజ‌నీరింగ్ డిపార్ట్‌మెంట్ త్వ‌ర‌లో ప‌నులు ప్రారంభించ‌నుంది. శ్రీవారి ఆల‌యాన్ని పోలిన మ‌రో ఆల‌యాన్ని తెలంగాణ నేల‌పై తీసుకురావాల‌ని TTD నిర్ణ‌యించడం నిజంగా తెలంగాణ నేత చేసుకున్న అదృష్ట‌మ‌ని హ‌రీష్ రావు అన్నారు. భ‌క్తులు ప్ర‌ద‌క్షిణ‌లు చేసుకోవ‌డానికి వీలు క‌ల్పించేలా బిల్డింగ్ డిజైన్ చేయాల‌ని హ‌రీష్ రావు ఇంజినీర్ల‌కు సూచించారు. ఈ శ్రావ‌ణ మాసంలోనే శంకుస్థాప‌న చేస్తే బాగుంటుంద‌ని అన్నార‌ట‌. మొత్తం 6 ఎక‌రాలలో ఈ ఆల‌యం రాబోతోంది.