Lakshmi Devi క‌టాక్షం పొందాలంటే..

Hyderabad: పూజ‌లు చేస్తేనో.. లేదా కొన్ని ప‌రిహారాలు చేస్తేనో డ‌బ్బు దానంత‌ట అదే వ‌చ్చి ప‌డుతుంటుంద‌ని చెప్తుంటారు కొంద‌రు (lakshmi devi). అలాంటివి అస్స‌లు న‌మ్మ‌కూడ‌దు. మ‌న వంతు ప్ర‌మ‌త్నం చేస్తూనే దైవానుగ్ర‌హం ఉండాల‌ని అనుకోవాలి. అయితే మ‌నం సంపాదించే డ‌బ్బు ఇంట్లో నిల‌వ‌క‌పోతే మాత్రం ఈ ల‌క్ష్మీ దేవి స్తోత్రం ప‌ఠించాల‌ట‌. అదేంటంటే..

శుక్ర‌వారం నాడు ఇంట్లో ఉన్న ల‌క్ష్మీ దేవి (lakshmi devi) ఫొటో ద‌గ్గ‌ర ఆవు నెయ్యితో దీపం పెట్టండి. అమ్మ‌వారి ఫొటో ద‌గ్గ‌ర ఒక ప‌సుపు కొమ్ము ఉంచండి. ఓం శ్రీ మ‌హాల‌క్ష్మి దేవ్య్ న‌మః అనే మంత్రాన్ని 21 సార్లు చ‌దువుకోండి. ఆ త‌ర్వాత అమ్మ‌వారికి హార‌తి ఇచ్చి ఆ ప‌సుపు కొమ్మును మీ ఇంట్లోని బీరువాలోనో లేదా బియ్యం డ‌బ్బాలో దాచుకోండి. ఇలా చేస్తే ల‌క్ష్మీ క‌టాక్షం క‌ల‌గ‌డ‌మే కాకుండా.. అన‌వ‌స‌ర ఖ‌ర్చులు పెర‌గ‌కుండా ఉంటాయి.