ప‌ర్సులో ఇవి పెట్టుకుంటే డ‌బ్బుకు లోటు ఉండ‌ద‌ట‌

మ‌నం బ‌య‌టికి వెళ్లినప్పుడు త‌ప్ప‌నిస‌రిగా ప‌ర్సు తీసుకుని వెళ్తుంటాం. ఎంత డిజిట‌ల్ పేమెంట్స్ చేసినా కూడా ప‌ర్సు వెన్నంటే తీసుకెళ్ల‌కుండా ఉండ‌లేం. అయితే.. వాస్తు ప్ర‌కారం పర్సులో కొన్ని ర‌కాల వ‌స్తువులు పెట్టుకుంటే ఆర్థిక ఇబ్బందులు ఉండ‌వ‌ట‌. అవేంటో చూద్దాం. (spiritual)

వెండి నాణెం

ఆర్థిక స‌మ‌స్య‌లు ఉండ‌కుండా ఉండాలంటే మీ ప‌ర్సులో ఒక వెండి కాయిన్ పెట్టుకోండి. వెండి శుక్రుడికి సంబంధించిన‌ది. ఆయ‌న నుంచి నెగిటివ్ ప్ర‌భావం ప‌డ‌కుండా ఉంటుంది. కాక‌పోతే ఆ కాయిన్ ప‌ర్సులో పెట్టుకోవ‌డానికి ముందు ల‌క్ష్మీదేవి ముందు పెట్టి పూజ చేసి అప్పుడ పెట్టుకోండి.

పెద్దలు ఇచ్చిన డ‌బ్బు

మ‌నం అమ్మ‌మ్మ‌, తాతయ్య‌ల ద‌గ్గ‌రికి వెళ్లిన‌ప్పుడు వారు మ‌న‌కి ఎవ్వ‌రికీ తెలీకుండా చేతులో డ‌బ్బులు పెడుతుంటారు. వార‌నే కాదు.. పెద్ద‌వారు ఎవ‌రు డ‌బ్బులు ఇచ్చినా కూడా దానిని ఖర్చు చేయ‌కుండా ప‌ర్సులోనే దాచుకోండి.

ల‌క్ష్మీ దేవి ఫోటో

ప‌ర్సులో ల‌క్ష్మీదేవి ఫోటోను పెట్టుకోండి. ఆర్థిక స‌మ‌స్య‌లు తొల‌గించే తల్లి ఆమే కాబ‌ట్టి ల‌క్ష్మీదేవి కూర్చుని ఉన్న ఫోటోను ప‌ర్సులో పెట్టుకోండి. కానీ ఫోటో మాత్రం న‌లిగేలా చిరిగిపోయేలా మాత్రం పెట్ట‌కండి.

రావి ఆకు

రావి ఆకు ఎంతో ప‌విత్ర‌మైన‌ది. ఒక ఆకును గంగా జ‌లంలో ముంచి దానిపై శ్రీ అని రాసి ప‌ర్సులో పెట్టుకోండి. ఆకు ఎండిపోయి ప్ర‌తీసారి వేరే ఆకును మారుస్తూ ఉండండి. వాడిపోయిన ఆకును తుల‌సి చెట్టు ద‌గ్గ‌ర కానీ ఇతర చెట్ల‌లో కానీ వేయండి.

బియ్యం

21 బియ్యపు గింజ‌ల‌ను ల‌క్ష్మీదేవి ముందు ఉంచి ఒక పేప‌ర్‌లో చుట్టి దానిని ప‌ర్సులో పెట్టుకోండి. ఇలా చేస్తే కూడా ఆర్థికంగా న‌ష్ట‌పోకుండా ఉంటారు.