రేపే తొలి శ్రావ‌ణ శుక్ర‌వారం.. నాగుల పంచ‌మి.. ఇలా చేస్తే మీ త‌ల‌రాత మారుతుంది

do this on first shravana friday to get abundance of luck from maa lakshmi

Spiritual: రేపే తొలి శ్రావ‌ణ శుక్ర‌వారం. నాగుల పంచ‌మి కూడా. ఈ రెండూ క‌లిసొచ్చిన రోజున‌ ల‌క్ష్మీదేవిని ఇలా ఆరాధిస్తే ఎంత‌టి ద‌రిద్ర‌మైన త‌ల‌రాతైనా మారిపోతుంద‌ట‌. ఏం చేయాలంటే.. పుట్ట ద‌గ్గ‌రికి వెళ్లి పాలు పోస్తే మంచిది. ఒక‌వేళ ఎక్క‌డా మీకు పాము పుట్టలు క‌నిపించ‌క‌పోతే ఇంట్లోనే ఎర్ర‌మ‌ట్టితో చిన్న పుట్ట‌ను త‌యారుచేసుకుని ప‌సుపు కుంకుమ పూలు వేస్తూ పూజించాలి.

చ‌లిమిడి నైవేద్యంగా పెట్టాలి. అలా పూజించే స‌మ‌యంలో స‌ర్ప సూక్తం చ‌దివినా విన్నా ఎంతో మంచిది. ఒక‌వేళ స‌ర్ప సూక్తం తెలీక పోతే ఓం నాగ‌దేవ‌తాయై న‌మః అని స్మ‌రించుకున్నా చాలు. ఇలా పూజ చేస్తే స‌ర్ప దోషాలు ఉంటే తీరిపోతాయి. అంతేకాదు.. జాత‌క చ‌క్రంలో బుధుడు పాడైతే పిల్ల‌ల‌కు చ‌దువు ఎక్క‌దు. అలాంట‌ప్పుడు ఏం చేయాలంటే ఆ పుట్ట మ‌ట్టిని కాస్త పిల్ల‌ల చెవుల‌కు రాయండి.

ఇలా చేస్తే పిల్ల‌ల్లో చ‌దువుకోవాల‌న్న ఆస‌క్తి క‌లుగుతుంది. పుట్ట మ‌ట్టి పెద్ద‌లు చెవుల‌కు రాసుకుంటే వ్యాపార, వృత్తి అభివృద్ధి జ‌రుగుతుంది. బంధువ‌ర్గంతో గొడ‌వ‌లున్నా, షేర్ మార్కెట్‌లో న‌ష్టాలు చూస్తున్న‌వారైనా ఈ మ‌ట్టి రాసుకోవ‌చ్చు. ఇక పిల్ల‌లు లేనివారు ఈ పుట్ట మ‌ట్టిని పొట్టకు రాసుకుంటే పిల్ల‌లు కలుగుతార‌ట‌.