రాత్రి ఆలస్యంగా భోజనం చేస్తున్నారా.. జాగ్రత్త!

ప్ర‌స్తుత పరిస్థితుల్లో సమయానికి భోజనం చేసేవారి సంఖ్య రోజురోజుకీ తగ్గిపోతుంది. ఉద‌యం, మ‌ధ్యాహ్నం, రాత్రి స‌మ‌యానికి భోజ‌నం చేయ‌క‌పోవ‌డం వల్ల అనేక వ్యాధుల‌కు గుర‌వుతున్నారు. అయితే ఉద‌యం, మ‌ధ్యాహ్నం క‌న్నా.. రాత్రి ఆల‌స్యంగా భోజ‌నం చేస్తేనే ముప్పు ఎక్కువ‌గా ఉంటుంద‌ంటున్నారు నిపుణులు.చేయకపోతే అనారోగ్య సమస్యలు వస్తాయి. ప్రతి రోజు సరైన టైంలోనే భోజనం చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. లేదంటే మన ఆరోగ్యం మన చేతుల్లో ఉండదు. అందుకే మన పెద్దవారు సమయానికి తినాలని సూచిస్తుంటారు. ఎటైనా వెళితే వేళకు భోజనం చేయాలని చెబుతుంటారు. ప్రతి రోజు మనకు సరైన తిండి, నిద్ర లేకపోతే మన శరీరం రోగాల మయం కావడం జరుగుతుంది. ఇలా భోజనం విషయంలో ఎవరు కూడా నిర్లక్ష్యంగా ఉండకూడదు.

*రాత్రి భోజనం కూడా 8 గంటల లోపు చేయాలి. ఎందుకంటే రాత్రి మనం తీసుకున్న ఆహారం జీర్ణం అయితేనే మనకు మంచి నిద్ర పడుతుంది. భోజనానికి మనం పడుకునే సమయానికి మధ్య రెండు గంటల గ్యాప్ ఉండాలి. లేదంటే నిద్ర పట్టదు. ఒకవేళ నిద్రపోయినా మధ్యలోనే మెలకువ వస్తుంది. అందుకే మనం తిన్న ఆహారం పూర్తిగా జీర్ణం కావడానికి కనీసం రెండు గంటల సమయం పడుతుంది. అందుకే డిన్నర్ త్వరగా పూర్తి చేసుకోవాలి. సాయంత్రం 6.30 లోపు తినడం ఇంకా సురక్షితం. మనం రోజు రాత్రి సమయంలో 8 గంటల లోపు భోజనం చేయకపోతే పొట్టు చుట్టు కొవ్వు పేరుకుపోతుంది. దీంతో రక్తంలో షుగర్ లెవల్స్ పెరిగి మధుమేహం బారిన పడే అవకాశం ఉంటుంది. ఈ ముప్పును తప్పించుకోవాలంటే వేళకు భోజనం చేయడమే చక్కని పరిష్కార మార్గం. ఆలస్యంగా భోజనం చేస్తే అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. అల్సర్, ఎసిడిటి వంటి వాటి వల్ల మన దేహం ఇబ్బందులు ఎదుర్కోవడం ఖాయం. అందుకే మనం తగిన జాగ్రత్తలు తీసుకోవడమే మంచిది.

*జీర్ణక్రియ సవ్యంగా జరగాలంటే సమయానికి ఆహారం తీసుకోవాల్సిందే. లేదంటే శరీరం రోగాలకు నిలయంగా మారుతుంది. సమయానికి ఆహారం తీసుకోకపోతే ఇబ్బందులు ఏర్పడతాయి. వైద్యులు కూడా రాత్రి పూట డిన్నర్ తొందరగానే పూర్తి చేయాలని చెబుతున్నారు. దీంతో మనం డిన్నర్ త్వరగా ముగించేందుకు చర్యలు తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని మన ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు రాత్రి భోజనం చేయాల్సి ఉంటుంది. రాత్రుళ్లు త్వరగా జీర్ణమయ్యే వాటినే తీసుకోవడం ఉత్తమం. మసాలాలు, మాంసం వంటి వాటిని తీసుకోకపోవడమే శ్రేయస్కరం. రాత్రి భోజనంలో పండ్లు ఉంచుకుంటే మరీ మంచిది.

*ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందులు, మానసి ఒత్తిడి ఇలా తదితర కారణాల రోగాల బారిన పడే అవకాశాలు అధికంగా ఉంటాయి. అలాగే తినే ఆహార సమయ వేళల్లో సరిగ్గా పాటించకపోతే కూడా అనారోగ్యం బారిన పడుతుంటాము. చాలా మంది తినే ఆహారం విషయంలో సమయ సందర్భాలు పాటించరు. సరైన సమయానికి ఆహారం తీసుకోకపోతే అనారోగ్యం బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా రాత్రి సమయాల్లో సరైన ఆహారం తీసుకొని, సరైన నిద్రపోవాలని, లేకపోతే ఒబిసిటి, హృద్రోగ సమస్యలతో బాధపడటం తప్పదని సూచిస్తున్నారు.

*రాత్రి సమయంలో భోజనం ఆలస్యంగా చేసినట్లయితే ఎన్నో రోగాలు దరిచేరే అవకాశం ఉంది. అందుకే రాత్రి సమయంలో భోజనం చేసే ముందు సమయ వేళలు పాటించాలని సూచిస్తున్నారు. ప్రస్తుత కాలంలో ఆలస్యంగా భోజనం చేసే వారి చాలా మంది ఉంటారు. రాత్రి సమయంలో భోజనంచేసే వారు దాదాపు 10 గంటల తర్వాత చేస్తుంటారు. కొందరేమో రాత్రి 11లకు భోజనం చేస్తుంటారు. అలా కాకుండా నిద్రకు కనీసం మూడు గంటల ముందైనా భోజనం చేస్తే చాలాంటున్నారు వైద్య నిపుణులు.