YV Subba Reddy: వారాహి యాత్ర ఎందుకో ఆయ‌న‌కే తెలీదు

AP: జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ (pawan kalyan) ఎందుకు వారాహి యాత్ర (varahi yatra) చేస్తున్నారో ఆయ‌న‌కే తెలీద‌ని అన్నారు YSRCP రీజ‌న‌ల్ కోఆర్డ‌నేట‌ర్ వైవీ సుబ్బారెడ్డి (yv subba reddy). ఏపీ ప్ర‌జ‌లు వారాహి యాత్ర‌ను, ప‌వ‌న్‌ను అస‌లు సీరియ‌స్‌గా కూడా తీసుకోవ‌డంలేద‌ని తెలిపారు. మంచి ప‌నులు చేస్తేనే ప్ర‌జ‌లు అలాంటి యాత్ర‌లపై ఇంట్రెస్ట్ చూపిస్తార‌ని అన్నారు. ఇక సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి (jagan mohan reddy) త్వ‌ర‌లో వైజాగ్ నుంచి కార్య‌కలాపాలు ప్రారంభిస్తార‌ని ఈ సంద‌ర్భంగా అన్నారు సుబ్బారెడ్డి.

ఇక TDP త‌ప్పుడు ప్ర‌చారాల‌తో ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెడుతోంద‌ని, ఈ నాలుగేళ్ల‌లో YSRCP ఏం చేసిందో ప్ర‌జ‌ల‌కు బాగా తెలుస‌ని అన్నారు. భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్ర‌యం, శ్రీకాకుళంలో మూలాపేట‌ స‌ముద్ర‌పోర్ట్, వైజాగ్‌లో ఇనార్బిట్ మాల్స్ శంకుస్థాప‌న జ‌ర‌గ‌డం TDPకి క‌నిపించ‌డంలేదా అని ప్ర‌శ్నించారు.