YV Subba Reddy: ష‌ర్మిళ చంద్ర‌బాబుని క‌లిస్తే న‌ష్ట‌మేంటి?

YV Subba Reddy: వైఎస్ షర్మిళ (ys sharmila) ఇటీవ‌ల తెలుగు దేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడుని (chandrababu naidu) క‌లిసిన సంగ‌తి తెలిసిందే. త‌న కుమారుడు రాజా రెడ్డి వివాహానికి చంద్ర‌బాబును ఆహ్వానించేందుకు వెళ్లారు. దీనిపై నేత వైవీ సుబ్బారెడ్డి స్పందిస్తూ.. ష‌ర్మిళ‌మ్మ చంద్ర‌బాబును క‌లిస్తే వ‌స్తే న‌ష్ట‌మేంట‌ని అన్నారు. ప‌చ్చ మీడియా దీనిని ఏదో పెద్ద విశేషంలా చూపించి వైర‌ల్ చేయాల‌ని చూస్తోంద‌ని.. ష‌ర్మిళ కాంగ్రెస్‌లో చేరినా కూడా త‌మ పార్టీ క‌లిగే న‌ష్టం ఏమీ లేద‌ని తెలిపారు. ష‌ర్మిళ త‌న రాజ‌కీయ భ‌విష్య‌త్తును నిర్ణ‌యించుకోవ‌డంలో త‌ప్పు లేద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు.