YSRTP: ష‌ర్మిళ మోసం చేసింది అంటూ ధ‌ర్నా

Telangana Elections: YSRTP పార్టీ కార్యాలయంలో అధ్య‌క్షురాలు వైఎస్ షర్మిల (ys sharmila) మోసం చేసింది అంటూ కార్యక‌ర్త‌లు ధ‌ర్నా చేప‌ట్టారు. తెలంగాణ రాష్ట్రంలో రానున్న అసెంబ్లీ ఎన్నికలకు YSRTP దూరంగా ఉంటున్నట్లు సమాచారం. గత కొద్ది రోజులుగా రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో పోటీలో ఉంటామని YSRTP ప్ర‌క‌టించింది. చివరగా గత రెండు రోజుల కింద జరిగిన ఉన్నత స్థాయి కార్యకర్త సమావేశంలో 50 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు నిర్ణ‌యించింది.

నిన్న సాయంత్రం తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల్లో YSRTP పోటీలో లేదంటూ ప్రకటన చేసినట్లు సమాచారం. దాంతో తెలంగాణ రాష్ట్రంలో YSRTP నాయకులు కార్యకర్తలను వాడుకుంటున్నారు అంటూ YSRTP నాయకులు ఆగ్రహం వ్య‌క్తం చేస్తున్నారు. షర్మిల డౌన్ డౌన్.. వి వాంట్ జస్టిస్ అని నినాదాలు చేస్తూ నిర‌సన తెలిపారు.