EXCLUSIVE: “తిడితే టికెట్లు ఇస్తారా.. మాకొద్దు”

AP Elections: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతున్నాయి. రేపో మాపో కేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌న్ విజయ‌వాడ‌లో ప‌ర్య‌టించ‌నుంది. అధికార పార్టీ ఇప్ప‌టికే చాలా మంది సిట్టింగ్‌ల‌ను ప‌క్క‌న పెట్టి కొత్త‌వారికి టికెట్లు ఇచ్చేసింది. రెండోసారి టికెట్ రాని వారిలో కొంద‌రు పార్టీ కోసం ప‌నిచేస్తామంటున్నారు ఇంకొంద‌రు కాంగ్రెస్, తెలుగు దేశం, జ‌న‌సేన పార్టీల్లో చేరిపోతున్నారు.

అయితే కొంద‌రు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు రాక‌పోవడంతో నేరుగా సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని (jagan mohan reddy) క‌లిసి చ‌ర్చించారు. అప్పుడు జ‌గ‌న్ వారితో అన్న మాట‌లు వైర‌ల్ అవుతున్నాయి. “” మీకు టికెట్లు కావాలంటే చంద్ర‌బాబు నాయుడు, నారా లోకేష్‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ల‌ను ధూషించాలి. ఎంత తిడితే అంత టికెట్లు వ‌చ్చే అవ‌కాశం ఉంటుంది. నేను సీఎం స్థాయిలో ఉండి తిట్ట‌లేను. అలా అని వారిని వ‌ద‌ల్లేను. అందుకే మీరు తిట్టాలి “” అని చెప్పార‌ట‌. అది విని సిట్టింగ్ ఎమ్మెల్యేలు షాక‌య్యారు.

“” టికెట్లు ఇస్తే ఇవ్వండి లేకపోతే లేదు. అంతేకానీ ఇలా ఇత‌రుల‌ను తిడితేనే టికెట్లు ఇస్తాం అని మాత్రం అన‌కండి. మీరు ఎవ‌రినైతే తిట్ట‌మంటున్నారో వారి కులానికి చెందిన‌వారు మా ప్రాంతాల్లో ఎక్కువ‌గా ఉన్నారు. నా చేత నా కులాన్నే తిట్టిస్తే నాకు ఓట్లు ఎలా ప‌డ‌తాయి “” అని ఓ కీల‌క నేత నేరుగా జ‌గ‌న్‌తో అన‌లేక త‌న తోటి నేత‌తో బాధ‌ను చెప్పుకున్నార‌ట‌.

తిడితే టికెట్లు.. మ‌రి గెల‌వ‌డం ఎలా?

జ‌గ‌న్ అన్న‌ట్లు నేత‌లు టికెట్లు కోసం చంద్ర‌బాబు నాయుడు, నారా లోకేష్, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ల‌ను తిడితే టికెట్లు ఇస్తారు సరే. మ‌రి గెల‌వ‌డం ఎలా? టికెట్ ఇచ్చినంత మాత్రాన స‌రిపోదు క‌దా..? గెల‌వడం ముఖ్యం క‌దా. వారిని తిడితే ప్ర‌జ‌లు ఓట్లు వేస్తార‌ని ఎలా అనుకుంటున్నారు? తిడితేనే గెలుస్తారు అంటే రాజ‌కీయ నాయ‌కులంతా రోజూ ప్రెస్ మీట్లు పెట్టి తిట్టుకుంటూ ఉండాలి.