Vinukonda: TDP, YSRCP కార్యకర్తల దాడి.. సీఐ కాల్పులు

Vinukonda: వినుకొండలో (vinukonda) ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. TDP నేత జీవీ ఆంజనేయులుపై (gv anjaneyulu) అక్రమ కేసులు పెట్టారని ఆ పార్టీ నాయకులు వినుకొండలో భారీ ర్యాలీ నిర్వహించారు. అదే సమయంలో వారికి YSRCP నాయకులు ఎదురు కావడంతో రాళ్లతో దాడులు చేసుకున్నారు. దీంతో పరిస్థితిని అదుపు చేసేందుకు పట్టణ సీఐ సాంబశివరావు గన్ బయటికి తీసి గాల్లో ఒక రౌండ్ కాల్పులు జరపగా, పరిస్థితి అదుపులోకి వచ్చింది.