Telangana Elections: పొత్తు లేకుండా సింగిల్‌గా బ‌రిలోకి

వైఎస్ విజ‌య‌మ్మ‌ (ys vijayamma), వైఎస్ ష‌ర్మిళ (ys sharmila) తెలంగాణ ఎన్నిక‌ల్లో (telangana elections) పోటీ చేయ‌నున్నారు. 100 సీట్ల నుంచి వైఎస్ షర్మిల పార్టీ YSRTP పోటీ చేయ‌నుంది. పాలేరు, మిర్యాలగూడ నుండి వైఎస్ షర్మిల పోటీ చేస్తారు. సికింద్రాబాద్ నుండి వైఎస్ విజయమ్మ బరిలోకి దిగుతారు.

కాంగ్రెస్ (congress) పార్టీలో షర్మిళ‌ పార్టీ విలీనానికి బ్రేక్ ప‌డటంతో తెలంగాణ ఎన్నిక‌ల్లో పోటీ చేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు. కాంగ్రెస్ పార్టీతో డీల్ సెట్ కాకపోవడంతో పాలేరు నుండి పోటీకి షర్మిళ‌ రెడీ అయ్యారు. ముందు నుంచి షర్మిళ‌ రాకను TPCC చీఫ్ రేవంత్ రెడ్డి (revanth reddy) వ్యతిరేకిస్తూ వ‌స్తున్నారు. షర్మిళ‌ పార్టీ నుండి పోటీ కోసం రెండు మూడు రోజుల్లో ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించే అవకాశం ఉంది.