YS Sunitha Reddy: క‌డ‌ప నుంచి వివేకా కుమార్తె పోటీ..!

YS Sunitha Reddy: దివంగ‌త నేత వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె వైఎస్ సునీత రెడ్డి వచ్చే ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో క‌డ‌ప నుంచి బ‌రిలో దిగాల‌ని అనుకుంటున్న‌ట్లు తెలుస్తోంది. వివేకానంద రెడ్డి హ‌త్య కేసులో ప్ర‌ధాన నిందితుడిగా ఉన్న అవినాష్ రెడ్డి ప్ర‌స్తుతం క‌డ‌ప ఎంపీగా ఉన్నారు. అవినాష్‌ను ఢీకొట్టేందుకు ముందు సునీత త‌న త‌ల్లి సౌభాగ్య‌మ్మ‌ను బ‌రిలోకి దించాల‌నుకున్నారు. కానీ ఈ వ‌య‌సులో ఆమెకు అంత క‌ష్టం ఎందుక‌ని భావించి నేరుగా తానే రంగంలోకి దిగ‌నున్న‌ట్లు స‌మాచారం.

వివేకా హ‌త్య జ‌రిగి రేప‌టితో ఐదేళ్లు కావొస్తుంది. రేపు వివేకా ఐదో వ‌ర్ధంతి సంద‌ర్భంగా క‌డ‌ప‌లో ఆత్మీయ స‌మ్మేళ‌న కార్య‌క్ర‌మాన్ని సునీత నిర్వ‌హించ‌నున్నారు. జ‌గ‌న్ ప్ర‌భుత్వం గురించి… త‌న తండ్రి హ‌త్య గురించి.. తాము పోలీసుల నుంచి ఎదుర్కొన్న అంశాల గురించి సునీత స్థానిక ప్ర‌జ‌ల‌కు తెలియ‌జేయాల‌నుకున్నారు. రాజ‌కీయం చేసేవారిని రాజ‌కీయాల‌తోనే ఎదుర్కొనాల‌ని ఈసారి సునీత దృఢంగా నిర్ణ‌యించుకున్నారు.

ALSO READ: YS Sunitha Reddy: ఎన్నిక‌ల‌కు ముందు జ‌గ‌న్‌కు మాస్ట‌ర్ స్ట్రోక్..!

ALSO READ: YS Sunitha Reddy: ద‌యచేసి మా అన్న‌కు ఓటెయ్యొద్దు