YS Sunitha Reddy: సునీత నోట కోడిక‌త్తి శ్రీను మాట‌

YS Sunitha Reddy: దివంగ‌త నేత వైఎస్ వివేకానంద రెడ్డి (YS Viveka Murder Case) ఐదో వ‌ర్ధంతి సంద‌ర్భంగా స్మార‌క స‌భ‌ను నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా వివేకా కుమార్తె వైఎస్ సునీత రెడ్డి ప్ర‌సంగించారు. YSRCP పార్టీని.. ఆ పార్టీ అధినేత‌లు చేసిన త‌ప్పుల‌ను ఎండ‌గ‌ట్టారు. ఈ నేప‌థ్యంలో వైఎస్ సునీత సుదీర్ఘ ప్ర‌సంగం చేసారు.

“” జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ముఖ్యమంత్రి కావాల‌ని మా నాన్న రాత్రింబ‌వ‌ళ్లు ఎంతో క‌ష్ట‌ప‌డ్డారు. నాన్న చ‌నిపోయిన రోజున అవినాష్ రెడ్డే నాతో స్వ‌యంగా చెప్పారు. రాత్రి 11 వ‌ర‌కు చిన్నాన్న ప్ర‌చారంలో ఉన్నార‌ని. మ‌రి అలాంటి వ్య‌క్తిని చంపించాల్సిన అవ‌స‌రం ఏముంది? నిందితుల‌ను ఇంట్లోనే పెట్టుకుని మాపై కేసులు వేసారు. మా నాన్న‌ను మేం చంపించామ‌ని చెప్తున్నారు. మ‌రి మీరు ఇప్పుడు అధికారంలో ఉన్నారు క‌దా..! మేమే త‌ప్పు చేసి ఉంటే మ‌మ్మ‌ల్ని అరెస్ట్ చేయించి విచార‌ణ చేయించండి. సీబీఐ విచార‌ణ వ‌ద్దు అన్నారు. పోనీ కోర్టు ద్వారా విచార‌ణ చేయించండి. మీరు ఎన్ని విధాలుగా విచార‌ణ‌లు చేయించినా మేం క‌డిగిన ముత్యంలా బ‌య‌టికి వ‌స్తాం. భార‌తి వ‌దిన‌ను ఒక్క‌టే కోరుకుంటున్నా.

మీ ద‌గ్గ‌ర సాక్ష్యాలు ఉంటే ద‌య‌చేసి పోలీసుల‌కు కోర్టుకు ఇవ్వండి. వైసీపీ పార్టీ పునాదులు ర‌క్తంలో మునిగి ఉన్నాయి. మా నాన్న ర‌క్తంతో పాటు కోడిక‌త్తి శ్రీను గారి రక్తం. ఈ ఐదో వ‌ర్ధంతి సంద‌ర్భంగా వైసీపీ నేత‌ల‌ను ఒక్క‌టే కోరుతున్నాను. వైపీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఇప్పుడే ఆ పార్టీని వీడండి. లేదంటే మా నాన్న‌ను చంపిన పాపం మీకు కూడా చుట్టుకుంటుంది “” అని తెలిపారు సునీతా రెడ్డి.

ALSO READ: Chandrababu Naidu: ఆప‌రేష‌న్ చీపురుప‌ల్లి.. బాబు ప్లానేంటి?