YS Sunitha Reddy: హోంమంత్రి అనిత‌ను క‌లిసిన వైఎస్ సునీతా రెడ్డి

ys sunitha reddy meets ap home minister vangalapudi anitha

YS Sunitha Reddy: దివంగ‌త నేత వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె వైఎస్ సునీతా రెడ్డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ హోంమంత్రి అనిత వంగ‌ల‌పూడిని క‌లిసారు. త‌న తండ్రి హ‌త్య కేసు విష‌యంలో ఇప్ప‌టికైనా ద‌ర్యాప్తును కాస్త వేగ‌వంతం చేయాల‌ని కోరారు. త‌ప్ప‌కుండా ఈ కేసు విష‌యాన్ని ప‌రిశీలిస్తాన‌ని.. త్వ‌ర‌లో నిందితుల‌కు శిక్ష ప‌డేలా చూస్తాన‌ని అనిత మాటిచ్చారు. సునీత భద్ర‌త విష‌యంలో కూడా అనిత చర్య‌లు తీసుకుంటామ‌ని అనిత తెలిపారు.