YS Sharmila: తుది దశకు చేరుకున్న పార్టీ విలీన ప్రక్రియ

Hyderabad: వైఎస్ ష‌ర్మిళ (ys sharmila) స్థాపించిన వైఎస్సార్ తెలంగాణ పార్టీని (ysr telangana party) కాంగ్రెస్‌లోకి విలీనం చేయాల‌ని ఎప్ప‌టినుంచో స‌న్నాహాలు జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ విలీన ప్ర‌క్రియ తుది ద‌శ‌కు చేరుకున్న‌ట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ (congress) పార్టీ పెద్దలను కలవడానికి ష‌ర్మిళ త‌న భ‌ర్త‌ బ్రదర్ అనిల్ కుమార్‌తో (brother anil kumar) కలిసి ఢిల్లీకి వెళ్లారు. పార్టీ విలీన తేదీ, తాను పోటీ చేయబోయే స్థానాల గురించి కాసేపట్లో కాంగ్రెస్ పెద్దలలో చ‌ర్చించ‌నున్న‌ట్లు స‌మాచారం.