YS Sharmila: అలా చేసినందుకే జ‌గ‌న్ అన్న‌ని ఇంట్లో కూర్చోపెట్టారు… ష‌ర్మిళ మాస్ వార్నింగ్

YS Sharmila warns tdp regarding vandalising ysr statues

YS Sharmila: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో తెలుగు దేశం పార్టీ కార్య‌క‌ర్త‌లు దివంగ‌త నేత‌ వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి విగ్ర‌హాల‌ను ధ్వంసం చేస్తున్నార‌ని.. వైఎస్సార్ కాంగ్రెస్ ఇలాంటి ప‌నులు చేయ‌బ‌ట్టే ప్ర‌జ‌లు జ‌గ‌న్‌ను ఇంట్లో కూర్చోపెట్టార‌ని అన్నారు ఏపీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిళ‌. ఇంకోసారి తెలుగు దేశం పార్టీ కార్య‌క‌ర్త‌లు త‌న తండ్రి విగ్ర‌హాల‌ను ధ్వంసం చేస్తే అదే చోట ధ‌ర్నా చేస్తాన‌ని హెచ్చ‌రించారు.

“” వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ వ్యక్తి … వైసీపీకి రాజశేఖర్ రెడ్డి గారికి సంబంధం లేదు. వైఎస్ఆర్ గారు నీతి, నిజాయితీ, నిబద్ధత ఉన్న కాంగ్రెస్ పార్టీ వ్యక్తి. టీడీపీ నేతలు, కార్యకర్తలకు ఇదే హెచ్చరిక. వైఎస్ఆర్ విగ్రహాలను ధ్వంసం చేస్తే ఊరుకునే ప్రసక్తిలేదు. మరోమారు ఇలాంటి సంఘటనలు జరిగితే అక్కడే భైఠాయించి ధర్నా చేస్తా. ఇలాంటి హత్య, కక్ష, గుండా రాజకీయాలు వైసీపీ చేసిందనే ప్రజలు ఘోరంగా వైసీపీని ఓడించారు. మళ్లీ అదే పరిస్థితి రాకుండా తెలుగుదేశం పార్టీ నాయకులు చూసుకోవాలని హెచ్చరిస్తున్నాను “” అని వార్నింగ్ ఇచ్చారు.