YS Sharmila: న్యాయం కోసం పోరాడుతున్నా.. ఆశీస్సులు కావాలి

YS Sharmila: ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ ష‌ర్మిళ ఈరోజు నుంచి ఎన్నిక‌ల ప్ర‌చార బ‌రిలోకి దిగ‌నున్నారు. ఈ నేప‌థ్యంలో త‌న త‌ల్లి విజ‌య‌మ్మ ఆశీర్వాదం తీసుకున్నారు. దేవుడి దీవెనలతో, నాన్న ఆశీర్వాదంతో, అమ్మ ప్రేమతో, చిన్నాన్న చివరి కోరిక ప్రకారం ఎన్నికల ప్రచారానికి బయలుదేరుతున్నానని.. రాజన్న బిడ్డను దీవించాలని, ఆంధ్ర రాష్ట్ర ప్రజలను కోరుకుంటూ ఎన్నికల శంఖారావం పూరించనున్నాన‌ని ట్వీట్ చేసారు. న్యాయం కోసం పోరాడుతున్న ఈ యుద్ధంలో మీ ఆశీస్సులు త‌న‌పై ఉంటాయని ఆశిస్తున్నాన‌ని పేర్కొన్నారు.

ఈసారి ఎన్నిక‌ల్లో ష‌ర్మిళ క‌డ‌ప నుంచి ఎంపీగా బ‌రిలోకి దిగ‌నున్నారు. క‌డ‌ప నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున అవినాష్ రెడ్డి పోటీ చేస్తున్నారు. అవినాష్‌ను ఓడించి చిన్నాన్న, దివంగ‌త నేత వైఎస్ వివేకానంద రెడ్డి ఆత్మ‌కు శాంతి క‌ల‌గాల‌ని కోరుకుంటున్న‌ట్లు ష‌ర్మిళ తెలిపారు. ఈ నేప‌థ్యంలో త‌న సోద‌రి ష‌ర్మిళ‌కు తోడుగా తాను నిల‌బ‌డ‌తాన‌ని వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి తెలిపారు.