YS Sharmila: జ‌గ‌న్ నా చేత అబ‌ద్ధాలు చెప్పించాడు..చంద్ర‌బాబుపై జ‌గ‌న్ కామెంట్.. మండిప‌డ్డ ష‌ర్మిళ‌

ys sharmila slams chandrababu naidu for not implementing schemes

YS Sharmila: ఆంధ్ర‌ప్రదేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు త‌ల్లికి వంద‌నం పేరిట ఎగ‌నామం పెట్టాడంటూ సాక్షి ప‌త్రిక‌లో రాయ‌డంతో మండిప‌డ్డారు APCC చీఫ్ వైఎస్ ష‌ర్మిళ‌. 2019 ఎన్నిక‌ల స‌మ‌యంలో అమ్మ ఒడి ప‌థ‌కం కింద ప్ర‌తి బిడ్డ‌కు రూ.15 వేలు ఇస్తాన‌ని జ‌గ‌న్ త‌న చేత అబ‌ద్ధ‌పు హామీలు ప‌లికించాడ‌ని.. తీరా అధికారంలోకి వ‌చ్చాక ప్ర‌తి బిడ్డ‌కు కాకుండా కేవ‌లం కుటుంబంలోని ఒక బిడ్డ‌కే రూ.15 వేలు ఇచ్చాడ‌ని.. అలాంటి వ్య‌క్తి ఈరోజు చంద్ర‌బాబు గురించి మాట్లాడ‌ట‌మా అని మండిప‌డ్డారు.

మ‌రోప‌క్క చంద్ర‌బాబు నాయుడు త‌ల్లికి వంద‌నం పేరిట ప్ర‌తి బిడ్డ‌కు రూ.15 వేలు ఇస్తామ‌న్నార‌ని.. కానీ నిన్న విడుద‌ల చేసిన జీవోలో ప్ర‌తి త‌ల్లికి రూ.15వేలు ఇస్తామ‌ని చెప్పార‌ని.. ఇది చాలా క‌న్ఫ్యూజన్‌గా ఉంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. జ‌గ‌న్ మోసం చేసిన‌ట్లు చంద్ర‌బాబు మోసం చేస్తే క‌చ్చితంగా కాంగ్రెస్ పార్టీ నిల‌దీస్తుంద‌ని హెచ్చ‌రించారు.