YS Sharmila: ఆ మాట అనే హ‌క్కు నాకే ఉంది

Hyderabad: జై తెలంగాణ (jai telangana) అనే హ‌క్కు త‌న‌కు మాత్ర‌మే ఉంద‌ని అంటున్నారు YSR తెలంగాణ పార్టీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిళ‌ (ys sharmila). తెలంగాణ పేరును పెట్టుకున్న ఏకైక పార్టీ త‌న‌దేన‌ని అన్నారు. ఏ వేదిక‌పైగా జై తెలంగాణ అనే ద‌మ్ము తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కి (kcr) కానీ, సోనియా గాంధీకి (sonia gandhi) కానీ ప్ర‌ధాని న‌రేంద్ర మోదీకి (modi) కానీ లేద‌ని ఎద్దేవా చేసారు. ఎందుకంటే వీరికి జాతీయ స్థాయి పార్టీల‌ని, ఈ రోజు తెలంగాణ ప్ర‌జ‌ల కోసం నిల‌బ‌డిన ఏకైక వైఎస్సార్ తెలంగాణ పార్టీ అన్నారు. త‌న గురించి మాట్లాడే ముందు సోనియా గాంధీ, కేటీఆర్ భార్య ఎక్క‌డి నుంచి వ‌చ్చారో అడ‌గాల‌ని అన్నారు. రానున్న తెలంగాణ ఎన్నిక‌ల్లో BRSకి గ‌ట్టి పోటీ ఇచ్చే అవ‌కాశం ఉన్న‌ట్లు క‌నిపిస్తోంది.