sharmila: అలాంటి వ్య‌క్తిని చంపితే సీబీఐ ఇంత లేట్ చేస్తుందా?

Hyderabad: వైఎస్సార్ తెలంగాణ పార్టీ(ysr telangana party) అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిళ(sharmila) వివేకానంద‌ రెడ్డి(vivekananda reddy) హ‌త్య కేసు గురించి స్పందించారు. సీబీఐ కేసును టేక‌ప్ చేసిన త‌ర్వాత ష‌ర్మిళ త‌న అభిప్రాయాన్ని వెల్ల‌డించారు. వివేకా గారు ఎంత మంచి వారంటే.. ఎవ‌రైనా ఒక స‌మ‌స్య‌తో త‌న వ‌ద్ద‌కు వ‌స్తే ఆ వ్య‌క్తిని తీసుకుని ఏ డిపార్ట్‌మెంట్‌కు వెళ్తే ప‌ని జ‌రుగుతుందో ఆ డిపార్ట్‌మెంట్‌కు వెళ్లి అక్క‌డిక‌క్క‌డే స‌మ‌స్య సాల్వ్ చేస్తారు. అది వివేకా రెడ్డిగారంటే. రాజ‌శేఖ‌ర్ రెడ్డి గారు ఆయ‌న్ని అలా త‌యారుచేసుకున్నారు. అంత‌టి మంచి వ్య‌క్తిని గొడ్డలితో న‌రికి చంపితే ఇప్ప‌టివ‌ర‌కు సీబీఐ కేసును ఓ కొలిక్కి తీసుకురాలేదు. అంత‌టి మ‌హానుభావుల కేసుల‌నే త్వ‌ర‌గా సాల్వ్ చేయ‌లేక‌పోతే ఇక సామాన్య ప్ర‌జ‌ల‌కు ఎలా త్వ‌ర‌గా న్యాయం జ‌రుగుతుంది అని ప్ర‌శ్నించారు.