YS Sharmila: సుప్రీంకోర్టు తీర్పు TDPకి చెంపపెట్టు

YS Sharmila reacts on supreme court laddoo case

YS Sharmila: తిరుమ‌ల ల‌డ్డూ క‌ల్తీపై సుప్రీంకోర్టు ఇచ్చిన సూచ‌నపై స్పందించారు APCC చీఫ్ వైఎస్ ష‌ర్మిళ‌. హిందువుల మనోభావాలు కూట‌మి సర్కార్‌కు ముఖ్యం అనుకుంటే వెంట‌నే సుప్రీంకోర్టు చెప్పిన‌ట్లుగా డిమాండ్ చేయాల‌ని ఆమె డిమాండ్ చేసారు.

“” తిరుమల లడ్డూ కల్తీపై ఇవ్వాళ గౌరవ సుప్రీంకోర్టు చేసిన సూచన కేంద్ర‌, రాష్ట్ర ప్రభుత్వాలకు చెంపపెట్టు లాంటిది. కేంద్రం దర్యాప్తు చేయాలని, CBIతో విచారణ చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ ముందునుంచే వాదిస్తోంది. ఇవ్వాళ సుప్రీం ఇచ్చిన సూచన కాంగ్రెస్ పార్టీ డిమాండ్‌కి బలం చేకూరినట్లయ్యింది. సిట్ దర్యాప్తు రబ్బర్ స్టాంప్ తప్పా.. విచారణకు ఉపయోగం లేదు. CBIకి అప్పగిస్తేనే లడ్డూ కల్తీపై లోతైన దర్యాప్తు జరుగుతుంది. ఆందోళనలో ఉన్న కోట్లాది మంది భక్తులకు నిజానిజాలు వెల్లడవుతాయి. కల్తీ ఎలా జరిగింది ? ఎక్కడ జరిగింది? పాల్పడ్డ దొంగలు ఎవరు? తక్కువ ధరకు కాంట్రాక్టు ఇవ్వడం వెనుక కారణం ఏంటి? NDDB రిపోర్ట్‌ను ఎందుకు ఇంతకాలం దాచిపెట్టారు? మత రాజకీయాలకు ఆజ్యం పోసింది ఎవరు ? ఇలాంటి ఎన్నో సందేహాలకు సమాధానం దొరకాల్సిన అవసరం ఉంది. నిందితులకు కఠిన శిక్ష పడాల్సిన అవసరం ఉంది. కూటమి సర్కారును మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం. దెబ్బతిన్న హిందువుల మనోభావాలు మీకు ముఖ్యం అనుకుంటే..మత రాజకీయాలు మీ అజెండా కాకపోతే లడ్డూ కల్తీపై సుప్రీంకోర్టు సూచనలు పరిగణనలోకి తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది “” అని ష‌ర్మిళ డిమాండ్ చేసారు.