YS Sharmila: చంద్ర‌బాబు చాలా చ‌క్క‌గా ప‌నిచేస్తున్నారు

ys sharmila praises chandrababu naidu

 

YS Sharmila: విజ‌య‌వాడను వ‌ర‌ద‌లు ముంచెత్తిన నేప‌థ్యంలో APCC అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిళ‌.. రాష్ట్ర ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుపై ప్ర‌శంస‌లు కురిపించారు. వ‌ర‌ద‌ల స‌మయంలో చంద్ర‌బాబు చేస్తున్న స‌ప‌ర్య చ‌ర్య‌లు సంతృప్తిక‌రంగా ఉన్నాయ‌ని.. చాలా బాగా ప‌నిచేస్తున్నార‌ని అన్నారు. కాక‌పోతే.. త‌న తండ్రి, దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి బుడ‌మేరు కొల్లేరు విష‌యంలో ఆప‌రేష‌న్ కొల్లేరును చేప‌ట్టి.. బుడ‌మేరు వాగును కొల్లేరుకు త‌ర‌లించేలా చేయాల‌ని ప్ర‌య‌త్నించార‌ని.. కానీ అప్పట్లో టెక్నిక‌ల్ స‌మ‌స్య‌ల వ‌ల్ల ఆ ఆప‌రేష‌న్ కొల్లేరు ముందుకు క‌ద‌ల్లేద‌ని అన్నారు. క‌నీసం ఇప్పుడైనా చంద్ర‌బాబు నాయుడు ఈ ఆప‌రేష‌న్ కొల్లేరును చేప‌డ‌తార‌ని ఆశిస్తున్న‌ట్లు తెలిపారు. బుడ‌మేరు ద‌గ్గ‌ర అక్ర‌మ నిర్మాణాలు తొల‌గించాల్సిన బాధ్య‌త కూడా చంద్ర‌బాబుపై ఉంద‌ని అన్నారు.