రామోజీ రావు కుటుంబాన్ని క‌లిసిన వైఎస్ ష‌ర్మిళ‌

YS Sharmila met late ramoji rao family

YS Sharmila: APCC చీఫ్ వైఎస్ ష‌ర్మిళ ఈనాడు సంస్థ‌ల అధినేత దివంగ‌త రామోజీరావు కుటుంబాన్ని క‌లిసారు. రామోజీ మృతి ప‌ట్ల సంతాపం తెలిపారు. కుటుంబీకుల‌కు ధైర్యం చెప్పిన‌ట్లు ష‌ర్మిళ పేర్కొన్నారు. వైఎస్ కుటుంబం నుంచి స్నేహ‌పూర్వకంగా రామోజీ ఇంటి గ‌డ‌ప తొక్కిన ఏకైక వ్య‌క్తి వైఎస్ షర్మిళ‌. గ‌తంలో మూడు సార్లు ఏపీ మాజీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి క‌లిసిన‌ప్ప‌టికీ రామోజీ ఆయ‌న్ను ఎక్క‌డ ఉంచాలో అక్క‌డ ఉంచారు.