YS Sharmila: అది పిరికిపందలు చేసే ప‌ని

ys sharmila condemns demolishing ysr statues

YS Sharmila: ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో వైఎస్సార్ విగ్ర‌హాల‌ను ధ్వంసం చేస్తున్న ఘ‌ట‌న‌ల‌పై స్పందించారు APCC చీఫ్ వైఎస్ ష‌ర్మిళ‌. ఇలాంటి పిరికిపంద‌లు చేస్తుంటార‌ని.. ఈ చ‌ర్య‌ల‌ను తాను ఖండిస్తున్నాన‌ని అన్నారు.

“” రాష్ట్రంలో మహానేత వైఎస్సార్ విగ్రహాలపై అల్లరి మూకలు చేస్తున్న వికృత దాడులను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. ప్రజాస్వామ్యంలో ఇలాంటి అరాచకాలు జరగడం అత్యంత దారుణం, మిక్కిలి శోచనీయం. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇలాంటి రౌడీ చర్యలు ఖండించి తీరాల్సిందే. ఇది పిరికిపందల చర్య తప్ప మరోటి కాదు. తెలుగువాళ్ళ గుండెల్లో గూడుకట్టుకున్న వైఎస్సార్ విశేష ప్రజాదరణ పొందిన నాయకులు. తెలుగు ప్రజల హృదయాల్లో ఆయనది చెరపలేని ఒక జ్ఞాపకం. అటువంటి నేతకు నీచ రాజకీయాలు ఆపాదించడం సరికాదు, గెలుపు ఓటములు ఆపాదించడం తగదు. వైఎస్సార్ ను అవమాయించేలా ఉన్న ఈ హీనమైన చర్యలకు బాధ్యులైన వారిపై వెనువెంటనే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది “” అని ఆవేద‌న వ్య‌క్తం చేసారు.