YS Sharmila: బాబుగారూ.. ద‌మ్ముంటే మోదీని నిల‌దీయండి

YS Sharmila condemns attack on deccan chronicle

YS Sharmila: విశాఖ ఉక్కు ప్రైవెటీక‌ర‌ణకు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం మొగ్గుచూపుతోంద‌ని ప్ర‌ముఖ ఆంగ్ల పత్రిక డెక్క‌ర్ క్రానిక‌ల్ ప్ర‌చురించ‌డం రాష్ట్ర‌వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. దాంతో తెలుగు దేశం పార్టీ కార్య‌క‌ర్త‌లు డెక్క‌న్ క్రానిక‌ల్ కార్యాల‌యాన్ని ధ్వంసం చేసారు. దీనిపై APCC చీఫ్ వైఎస్ ష‌ర్మిళ స్పందించారు. ఈ దాడిని తాను ఖండిస్తున్నాన‌ని అన్నారు.

“” విశాఖలోని డక్కన్ క్రానికల్ కార్యాలయంపై తెదేపా కార్యకర్తల దాడి ఖండించదగింది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అడ్డుకోలేక, ఎదురు ఈ చర్యలా? మేలుకోకపోతే రేపు ప్రజలు మీకు జవాబు చెప్తారు. దమ్ముంటే మోడీని నిలదీయండి, అంతే కానీ నిలదీసే గొంతులపై ఉక్కుపాదం మోపద్దు, ప్రజాస్వామ్యం కోసం పాటుపడే పార్టీగా కాంగ్రెస్ ఇటువంటి దాడులను ఖచ్చితంగా వ్యతిరేకిస్తుంది “” అని తెలిపారు.