YS Sharmila: టైం మీరు చెప్పినా స‌రే.. న‌న్ను చెప్ప‌మ‌న్నా స‌రే

YS Sharmila: ఏపీ కాంగ్రెస్ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిళ‌.. వైవీ సుబ్బారెడ్డికి (yv subba reddy) స‌వాల్ విసిరారు. పలాస నుంచి ఇచ్ఛాపురం వరకు APSRTC బస్సులో ప్రయాణికులతో మాట్లాడి వారి ప్రాంతంలో జరిగిన అభివృద్ధిపై ష‌ర్మిళ వారితో చ‌ర్చించారు. రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిపై వైవీ సుబ్బారెడ్డి సవాల్‌ని స్వీకరిస్తున్నానని అన్నారు.

“”  మీరు చేసిన అభివృద్ధి చూపించండి.. మీ అభివృద్ధి చూడటానికి నేను సిద్ధం.. డేట్, టైం మీరు చెప్పినా సరే.. నన్ను చెప్పమన్నా సరే .. నాతో పాటు మేధావులు, ప్రతిపక్షాలు, మీడియా ప్రతినిధులను కూడా పిలుద్దాం.. మీరు అభివృద్ధి చేసింది ఎక్కడా..? మీరు చెప్పిన రాజధాని ఎక్కడా..? మీరు కట్టిన పోలవరం ప్రాజెక్ట్ ఎక్కడా..? ఇలా మీ అభివృద్ధి ఆంధ్ర రాష్ట్రం అంతా చూడాలని అనుకుంటున్నాము ..చూపించండి “” అంటూ స‌వాల్ విసిరారు.