YS Sharmila: సిద్ధం అన్నావ్.. 11 మంది స‌రిపోరా జ‌గ‌న్?

ys sharmila asks jagan why should congress support ysrcp

YS Sharmila: సిద్ధం సిద్ధం అన్నావ్ క‌దా జ‌గ‌న్.. మ‌రి ధ‌ర్నా చేసేందుకు మీ 11 మంది ఎమ్మెల్యేల బ‌లం స‌రిపోదా అంటూ ఏకిపారేసారు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిళ‌. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఆట‌విక పాల‌న న‌డుస్తోంద‌ని మొన్న జ‌గ‌న్ త‌న పార్టీ నేత‌ల‌ను వెంట‌పెట్టుకుని వెళ్లి ఢిల్లీలో ధ‌ర్నా చేసిన సంగ‌తి తెలిసిందే. ఇండియా కూట‌మి నుంచి దాదాపు 8 పార్టీలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మ‌ద్ద‌తు తెలిపాయి. కానీ ప్ర‌ధాన‌మైన కాంగ్రెస్ పార్టీ మాత్రం మ‌ద్ద‌తు తెలప‌లేదు. దాంతో జ‌గ‌న్ కాంగ్రెస్‌పై విరుచుకుప‌డ్డారు. ఎందుకు మ‌ద్ద‌తు తెల‌ప‌లేద‌ని ప్ర‌శ్నించారు. దీనిపై ష‌ర్మిళ స్పందించారు.

“” కాంగ్రెస్ పార్టీ ఎందుకు రాలేదో సమాధానం చెప్పాలంటున్న జగన్ గారు… మీ ధర్నాకు సంఘీభావం ఎందుకు ప్రకటించాలి ? పార్టీ ఉనికి కోసం ఢిల్లీలో కపట నాటకం ఆడినందుకా..? వ్యక్తిగత హత్యకు రాజకీయ రంగు పులిమినందుకా..? 5 ఏళ్లు బీజేపితో అక్రమ సంబందం పెట్టుకుని, విభజన హక్కులను, ప్రత్యేక హోదాను బీజేపీకి తాకట్టు పెట్టి.. ఆఖరుకి మణిపూర్ ఘటనపై నోరెత్తని మీకు…ఉన్నట్లుండి అక్కడి పరిస్థితులు గుర్తుకు రావడం విడ్డూరం. క్రిష్టియన్ అయి ఉండి క్రైస్తవులను ఊచకోత గురి చేసినా.. నోరు మెదపకుండా విపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానంలో బీజేపీకే మద్దతు ఇచ్చారు కదా? YSR వ్యతిరేకించిన మతతత్వ బీజేపికే జై కొట్టారు కదా? మణిపూర్ ఘటనపై కాంగ్రెస్ దేశవ్యాప్త ఉద్యమం చేస్తుంటే మీనుంచి వచ్చిందా సంఘీభావం? మీ నిరసనలో నిజం లేదని, స్వలాభం తప్పా…రాష్ట్రానికి ప్రయోజనం శూన్యమని తెలిసే కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉంది. సిద్ధం అన్న వాళ్లకు 11మంది బ‌లం సరిపోలేదా.. ఇప్పుడు కలిసి పోరాడుదాం అంటున్నారు? “” అని మండిప‌డ్డారు ష‌ర్మిళ‌