YS Bharathi: సాక్షికి భార‌తి గుడ్‌బై

ys bharathi to leave sakshi channel

YS Bharathi:  వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి చెందిన సాక్షి ఛానెల్‌కు ఆయ‌న స‌తీమ‌ణి వైఎస్ భార‌తి రెడ్డి గుడ్‌బై చెప్ప‌నున్న‌ట్లు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ ఓడిపోవ‌డానికి ఓ ర‌కంగా సాక్షి కూడా కార‌ణ‌మే అని అంత‌ర్గ‌తంగా చ‌ర్చ‌లు జ‌రిగాయ‌ట‌. దాంతో భార‌తిపై పార్టీ నేత‌ల్లో కాస్త అసంతృప్తి కూడా ఉంది.

అందుకే భార‌తి సాక్షి ఛానెల్‌కు గుడ్‌బై చెప్పాల‌ని ఇత‌ర వ్యాపారాల‌ను చూసుకుంటాన‌ని జ‌గ‌న్‌కు చెప్పార‌ట‌. ఇందుకు జ‌గ‌న్ కూడా ఒప్పుకున్న‌ట్లు తెలుస్తోంది. భార‌తి స్థానంలో జ‌గ‌న్ ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన రాణి రెడ్డి అనే వ్య‌క్తి సాక్షి ఎండీగా బాధ్య‌త‌లు తీసుకోనున్న‌ట్లు సమాచారం. ప్రస్తుతం రాణి రెడ్డి సాక్షి గ్రూప్ కార్పొరేట్ డైరెక్ట‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఎడిట‌ర్ బాధ్య‌త త‌ప్ప సాక్షికి సంబంధించిన మిగ‌తా అంశాల‌న్నీ రాణి రెడ్డి చూసుకుంటార‌ట‌.