YCP Manifesto: కొత్త ప‌థ‌కాల‌ను చేర్చ‌నున్న జ‌గ‌న్

YCP Manifesto: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌లు (AP Elections) ద‌గ్గ‌ర‌ప‌డుతున్న స‌మ‌యంలో ఈరోజు ఉద‌యం తాడేప‌ల్లిగూడెంలోని త‌న పార్టీ కార్యాల‌యంలో సీఎం జ‌గన్ మోహ‌న్ రెడ్డి (Jagam Mohan Reddy) పార్టీ నేత‌ల‌తో భేటీ అయ్యారు. ఆల్రెడీ అమ‌లులో ఉన్న మేనిఫెస్టోకి ఇంకో 6 కొత్త ప‌థ‌కాల‌ను జోడించాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నారు. ప్ర‌స్తుతానికైతే YSRCP హైక‌మాండ్ మేనిఫెస్టోపై ఫోకస్ చేస్తోంది. త్వ‌ర‌లో మేనిఫెస్టోను ప్ర‌క‌టించ‌నున్నారు. జ‌గ‌న్ చెప్పాడంటే చేస్తాడంతే అనే న‌మ్మ‌కం ప్ర‌జ‌ల్లో బ‌లంగా ఉంద‌ని వైసీపీ నేత‌లు అంటున్నారు. 2019 అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యంలో ప్ర‌క‌టించిన మేనిఫెస్టోలో ఇచ్చిన అంశాల‌ను 99 శాతం అమ‌లు చేసామ‌ని అంటున్నారు. ఇప్పుడు అదే మేనిఫెస్టోలో ప్ర‌జ‌ల‌కు ఉప‌యోగ‌ప‌డే మ‌రో 6 ప‌థ‌కాల‌ను ప్ర‌వేశ‌పెట్ట‌నున్నారు.