Pawan Kalyan: జ‌న‌సేనానికి స‌వాళ్ల మీద స‌వాళ్లు..!

AP: జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ (pawan kalyan) వారాహి యాత్ర‌తో (varahi) బిజీ బిజీగా ఉన్నారు. ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో ప‌ర్య‌టిస్తున్న ఆయ‌న ప్ర‌తి ప్ర‌చార స‌భ‌లో YCP నేత‌ల‌పై తీవ్ర ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో రోజుకో YCP నేత మీడియా ముందుకు వ‌చ్చి ప‌వ‌న్‌కు స‌వాళ్ల‌పై స‌వాళ్లు విసురుతున్నారు. రెండు రోజుల క్రితం.. ప‌వ‌న్ ద్వారంపూడి చంద్ర‌శేఖ‌ర్ రెడ్డిపై (dwarampudi chandrasekhar reddy) మండిప‌డిన సంగ‌తి తెలిసిందే. అధికారంలోకి వచ్చాక భీమ్లా నాయ‌క్ ట్రీట్మెంట్ ఇచ్చి న‌డిరోడ్డుపై కొట్టుకుంటూ వెళ్తా అంటూ భారీ డైలాగులు వాడేసారు.

ఆ త‌ర్వాత ద్వారంపూడి కూడా ప‌వ‌న్‌కు గ‌ట్టి వార్నింగ్ ఇచ్చారు. ఇంకోసారి ప‌ర్స‌న‌ల్ విష‌యాల‌ను తీసుకొచ్చి నోటికొచ్చిన‌ట్లు మాట్లాడితే.. మూడు పెళ్లిళ్ల గురించి మాట్లాడాల్సి వ‌స్తుంద‌ని అన్నారు. ద‌మ్ముంటే కాకినాడలో త‌న‌పై పోటీ చేయాల‌ని స‌వాలు విసిరారు. ఆ త‌ర్వాత రోజా (roja) కూడా ప‌వ‌న్‌కు ఛాలెంజ్ చేసింది. ఎవరికీ తెలీకుండా అర్థరాత్రి మీటింగ్‌లు పెట్టుకునే వ్యక్తిని ఇత‌న్నే చూస్తున్నాన‌ని కావాలంటే.. ముందుగానే చెప్ప‌కుండా ఏపీలో ఎక్క‌డికైనా వ‌చ్చి మీటింగ్ పెట్టాల‌ని స‌వాలు విసిరారు. ప‌వ‌న్‌తో పాటు ఇత‌ర ప్రాంతాల్లో తాను, బైరెడ్డి సిద్ధార్థ్‌రెడ్డి కూడా మీటింగ్ పెడ‌తామ‌ని అప్పుడు ఎవ‌రికి ఎక్కువ మంది జ‌నాలు వ‌స్తారో తెలిసిపోతుంద‌ని అన్నారు.

ఆ త‌ర్వాత పిఠాపురంలో స‌భ పెట్టిన ప‌వ‌న్.. ముద్ర‌గ‌డ‌పై (mudragada) మండిప‌డ్డారు. దాంతో ముద్ర‌గ‌డ కూడా పిఠాపురంలో త‌న‌పై పోటీ చేసి గెలిస్తే అప్పుడు ఒప్పుకుంటాన‌ని అన్నారు. ఇలా ఎవ‌రికి వారు స‌వాళ్లు చేసుకుంటూ పోతున్నారు. అదృష్టం బాగుండి వచ్చే ఏపీ ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ గెలిస్తే మాత్రం వీరంద‌రికీ ఒకేసారి ఆన్స‌ర్ ఇచ్చిన‌వారు అవుతారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.