Yashaswini: ఎర్ర‌బెల్లి క‌ల‌లు కంటున్నారు.. గెలిచేది నేనే

Telangana Elections: కాంగ్రెస్ త‌ర‌ఫున పాల‌కుర్తిలో పోటీ చేసేందుకు ఝాన్సీ రెడ్డికి (jhansi reddy) టికెట్ రాక‌పోవ‌డంతో ఆమె కోడ‌లు య‌శ‌స్విని రెడ్డి (yashaswini reddy) రంగంలోకి దిగారు. కాంగ్రెస్ పాల‌కుర్తి టికెట్ య‌శ‌స్వినికి ఇచ్చింది. అటు BRS పార్టీ నుంచి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు (errabelli dayakar rao) పోటీలో ఉన్నారు.

ఎర్ర‌బెల్లి ముందు తాను చిన్న పిల్ల‌నే అయినా పోటీలో మాత్రం గెలుపు త‌న‌దేన‌ని అంటున్నారు య‌శ‌స్విని రెడ్డి. ఈసారి రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ గాలి వీస్తోంద‌ని.. పాల‌కుర్తిలో త‌న గెలుపు త‌థ్యం అని అన్నారు. ఎర్ర‌బెల్లి గెలిచి తీర‌తాను అని ప‌గ‌టి క‌ల‌లు కంటున్నార‌ని క‌ల‌లు క‌న‌డంలో త‌ప్పేమీ లేదని ఎద్దేవాచేసారు. గెలిచాక పాల‌కుర్తిలో డిగ్రీ కాలేజ్‌తో పాటు త‌న అత్తింటివారు 70 ఎక‌రాల్లో కొనుగోలు చేసిన స్థ‌లంలో స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ సెంట‌ర్లు, ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటుచేస్తామ‌ని పేర్కొన్నారు.