Pawan Kalyan: ఇసుక కాంట్రాక్టులు వారి ద‌గ్గ‌రే ఎందుకు?

AP: ఇసుక కాంట్రాక్టులు 3 కంపెనీల దగ్గరే ఎందుకు ఉండాలి అని YSRCP ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించారు జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ (pawan kalyan). ప్ర‌స్తుత ప్ర‌భుత్వం చేస్తున్న త‌ప్పుల‌ను ఎత్తి చూపుతూనే వాటికి త‌గ్గ‌ట్టు తాము అధికారంలోకి వ‌స్తే ఏం చేస్తామో కూడా ప‌వ‌న్ చెప్తున్నారు. ఇసుక కాంట్రాక్టులు 3000 మంది BC, ST, SCల దగ్గర ఎందుకు ఉండకూడదు అని ఈ సంద‌ర్భంగా YSRCPని ప్ర‌శ్నించారు. జనసేన (janasena) అధికారంలోకి వస్తే ఇసుక కాంట్రాక్టులు ఎక్కువ మంది దగ్గర ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామ‌ని తెలిపారు. దారిద్యరేఖకు దిగువన ఉన్న వారికి ఇసుక ఉచితంగా ఇస్తామ‌ని హామీ ఇచ్చారు.