Revanth Reddy: సోనియాతో పాటే ఎందుకు రేవంత్ స్టేడియంకు వ‌చ్చారు?

Revanth Reddy: రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేస్తున్న నేప‌థ్యంలో కాంగ్రెస్ హైక‌మాండ్ అయిన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు కూడా వేడుక‌కు హాజ‌ర‌య్యారు. అయితే మీరు గ‌మ‌నించిన‌ట్లైతే.. వేడుక‌కు రాహుల్, ప్రియాంక స‌ప‌రేట్‌గా వ‌చ్చారు. కానీ రేవంత్, సోనియా మాత్రం ఎయిర్ పోర్ట్ నుంచి క‌లిసే వ‌చ్చారు. ఎల్బీ స్టేడియంకు కూడా క‌లిసే ఒకే వ్యానుపై వ‌చ్చారు.

ఇందుకు కార‌ణం లేక‌పోలేదు. తెలంగాణ‌ను ఇచ్చింది సోనియా గాంధీనే అని అంద‌రికీ తెలిసిందే. రాష్ట్రం కోసం ఎంద‌రో ప్రాణ త్యాగం చేసిన త‌ర్వాత సోనియా ఇంకా మౌనంగా ఉండ‌లేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారు. అందుకే తెలంగాణ‌లో సోనియాను ప్ర‌జ‌లు సోనియ‌మ్మ అని పిలుచుకుంటారు. అలాంటి సోనియా గాంధీ ఈసారి తెలంగాణ పక్షాన ఉండి రేవంత్ రెడ్డి ఆధ్వ‌ర్యంలో మంచి పాల‌న తీసుకొస్తాను ప్ర‌జ‌ల వెన్నంటే ఉంటాను అనే న‌మ్మ‌కాన్ని క‌లిగించేందుకు రేవంత్‌తో పాటే గ్రౌండ్‌లో అడుగుపెట్టార‌ని తెలుస్తోంది.