Rahul Gandhi: రిలాక్స్.. దాని గురించి మాట్లాడ‌నులే..!

Delhi: మొత్తానికి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (rahul gandhi) పార్ల‌మెంట్ స‌మావేశంలో నోరు విప్పారు. అవిశ్వాస తీర్మాన డిబేట్‌లో పాల్గొన్నారు. రాహుల్ త‌న స్పీచ్ మొద‌లుపెట్ట‌డానికి ముందు స్పీక‌ర్‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పారు. ఆ త‌ర్వాత కేంద్ర‌మంత్రి అమిత్ షా (amit shah) వైపు చూస్తూ… “” భ‌య‌ప‌డ‌కండి.. ఈరోజు నేను అదానీ గురించి మాట్లాడ‌నులే. రిలాక్స్. ఇప్ప‌టివ‌ర‌కు ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ మ‌ణిపూర్‌కి వెళ్లలేదు. ఆ రాష్ట్రం రెండుగా చీలిపోయింది. మ‌ణిపూర్‌లో ఇండియాను చంపేసారు “” అంటూ త‌న డిబేట్‌ను ప్రారంభించారు రాహుల్.