EXCLUSIVE: రోజుకొకరి చొప్పున.. వైసీపీకి వీడ్కోలు

EXCLUSIVE: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతున్న స‌మ‌యంలో మెల్లిగా రోజుకో సిట్టింగ్ ఎమ్మెల్యే, ఎంపీ YSRCP పార్టీకి గుడ్ బై చెప్పేస్తున్నారు. దాంతో సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప‌రిస్థితి అగ‌మ్య గోచ‌రంగా మారిపోయింది. ఉండ‌మ‌ని చెప్ప‌లేక వెళ్ల‌మ‌నలేక లోలోప‌లే స‌త‌మ‌త‌మ‌వుతున్నారు. మొన్న సీఎం క్యాంపు కార్యాలయంలోనే ఎంపీ గోరంట్ల మాధ‌వ్ వాదనకి దిగారు. నిన్న క‌ర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ పార్టీకి రాజీనామా చేసారు. నేడు వైఎస్ రాజశేఖ‌ర్ రెడ్డి విధేయుడు, ఎంపీ బాలశౌరి జ‌గన్‌తో తెగ‌దెంపులు చేసుకున్నారు. ఇక బాలినేని శ్రీనివాస్ రెడ్డి ముందే ప‌సిగ‌ట్టి పార్టీలో త‌న‌కు గుర్తింపు లేద‌ని మీడియా ముందే చెప్పేసారు. సిట్టింగులే ఇలా వీడుతున్నారంటే ఎన్నికల ఫలితం ఇక ఖరారు చేసుకోవచ్చు అని రాజ‌కీయ విశ్లేష‌కులు భ‌విష్య‌వాణి చెప్పేస్తున్నారు.