AP Elections: చీలిక‌లు.. చేరిక‌లు..!

AP Elections:  ఏపీ రాజ‌కీయాలు రోజురోజుకీ ర‌సవ‌త్త‌రంగా మారుతున్నాయి. వైఎస్ ష‌ర్మిళ (ys sharmila) ఏపీలో అడుగుపెట్టినప్ప‌టి నుంచి YSRCPలో ఒక్క‌సారిగా భూకంపం వ‌చ్చిన‌ట్లు అయ్యింది. ఇప్ప‌టికే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డితో పాటు ఇత‌ర నేత‌లు ష‌ర్మిళ వెంటే న‌డుస్తామ‌ని ప్ర‌క‌టించారు. దాంతో YSRCPలో చీలిక‌లు.. TDPలో చేరిక‌లు మొద‌ల‌య్యాయి. ఇప్ప‌టికే YSRCP ఎమ్మెల్సీ రామ‌చంద్ర‌య్య తెలుగు దేశం పార్టీలో చేరారు. కేంద్ర‌మంత్రి విజ‌య‌సాయి రెడ్డి బావ‌మ‌రిది కూడా ప‌సుపు జెండా ఊపేసారు. ఎంపీ గోరంట్ల మాధ‌వ్ త‌న‌కు ఎందుకు టికెట్ ఇవ్వ‌డంలేదు అని స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డిని నిల‌దీసారు. మ‌ల్లాది విష్ణు నుంచి కూడా సంకేతాలు క‌నిపిస్తున్నాయి. ఇంకొంద‌రు YSRCP నేత‌లు టికెట్ రాదేమోన‌న్న కోపంతో తెలుగు దేశం పార్టీలోకి కాకుండా కాంగ్రెస్‌లోకి జంప్ అవ్వాల‌ని చూస్తున్నారు.