EXCLUSIVE: గృహ‌జ్యోతి ప‌థ‌కానికి ఎవ‌రు అర్హులు?

EXCLUSIVE: తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన ప‌థ‌కాల్లో గృహ‌జ్యోతి (gruha jyothi) ప‌థ‌కం ఒక‌టి. ఈ ప‌థ‌కం ఎవ‌రికి వ‌ర్తిస్తుంది? ఎవ‌రు అర్హులు? వంటి వివ‌రాల‌ను సీఎం రేవంత్ రెడ్డి (revanth reddy) వివ‌రించారు. అయితే ఈ గృహ‌జ్యోతి ప‌థ‌కానికి ల‌బ్ధిదారుల‌పై ఇంకా క్లారిటీ రాలేద‌ని క‌స‌ర‌త్తు చేస్తున్నామ‌ని రేవంత్ అన్నారు. ఈ గృహజ్యోతి ప‌థ‌కానికి కూడా తెల్ల రేష‌న్ కార్డునే ప్ర‌మాణికంగా తీసుకుంటారా లేక వేరే ఆప్ష‌న్ ఉంటుందా అనేదానిపై కూడా క్లారిటీ లేక ప్ర‌జ‌లు గంద‌ర‌గోళానికి గుర‌వుతున్నారు. గృహ‌జ్యోతి ప‌థ‌కానికి ఏటా రూ.10వేల కోట్లు ఖ‌ర్చు అవుతుంది. ప్రస్తుతం తెలంగాణ‌లో 91 ల‌క్ష‌ల మంది వ‌ద్ద తెల్ల రేష‌న్ కార్డులు ఉన్నాయి.