YS Sharmila: అస‌లు జ‌నం మీకెందుకు ఓటెయ్యాలి?

YS Sharmila: KCR ప్ర‌జ‌ల‌ను క‌ల‌వాల్సిన అవ‌స‌రం ఏముంద‌ని KTR అడుగుతున్నార‌ని.. అస‌లు జ‌నం వారికి ఎందుకు ఓటెయ్యాల‌ని ప్ర‌శ్నించారు వైఎస్ ష‌ర్మిళ‌.

“”ఓట్లేసి గెలిపిస్తే ప్రజలకు సేవ చేయడానికా లేక గడీల్లో భోగాలు అనుభవించడానికా? నాడు మహానేత వైయస్ఆర్ గారు రచ్చ బండలో ప్రజల ప్రతి సమస్యను తెలుసుకొని పరిష్కరించి ప్రజా ప్రభుత్వానికి చిరునామాగా నిలిస్తే..క్యాంప్ ఆఫీస్ లోనే ప్రజా దర్బార్ పెట్టి ప్రతి సమస్యను వింటే….నేడు కేసీఆర్ చేస్తున్నది నియంత పాలన. ఓట్లేసిన పాపానికి జనాలకు కష్టాలు..దొరకు ఫామ్ హౌజ్ వైభోగాలు. అధికార మత్తులో మీకు ప్రజా సమస్యలు కనిపిస్తలే.. ఇండ్లు లేక పేదలు రోడ్డెక్కి ధర్నాలు చేస్తే మీకు కళ్లు కనపడతలే.

ధరణి సమస్యలపై రైతుల గోడు వినిపించదు.. ఉద్యోగాలు కావాలని మొత్తుకుంటున్న నిరుద్యోగుల ఆకలి కేకలు మీ చెవిన పట్టవు.. సర్కారు బడిలో సౌక‌ర్యాలు లేక పేద బిడ్డలు పడుతున్న బాధలు మీకు కానరావు.. రాష్ట్రంలో ప్రతి వర్గాన్ని సమస్యల సుడిగుండంలో ముంచారు. మీ పాలనలో ప్రజలకు మిగిలింది కష్టాలు, కన్నీళ్లే.. ముమ్మాటికి మీరు తెలంగాణ ద్రోహులే. కేసీఆర్ అంతటి అహంకార ముఖ్యమంత్రి చరిత్రలో ఎవ్వరూ లేరు “” అని ట్వీట్ చేసారు ష‌ర్మిళ‌.