Nara Lokesh: వైఎస్ సునిత రెడ్డికి మేం న్యాయం చేస్తాం

Nara Lokesh: హిందూపూర్ శంఖారావం సభలో తెలుగు దేశం పార్టీ నేత‌ నారా లోకేష్ ప్ర‌సంగించారు. సభికులను నేను కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నా. ప్రపంచంలో 7 వింతలు ఉన్నాయి. నేడు 8వ వింత వచ్చింది. ప్రిజనరీ జగన్‌కు విజన్ ఉందంటా.. జైలుకు వెళ్లిన వాళ్లకు విజన్ ఉంటుందా? అంటూ స‌భ‌ను మొద‌లుపెట్టారు నారా లోకేష్‌.

“”” ఉమ్మడి అనంతపురం అదిరిపోయింది. లేపాక్షి వీరభద్ర ఆలయం, సుగూరు ఆంజనేయస్వామి ఆలయం, పుట్టపర్తిలో భగవాన్ సత్యసాయి నిలయం ఉన్న పుణ్యభూమి ఈ అనంతపురం. ప్రపంచంలోనే అతిపెద్ద తిమ్మమ్మ మర్రిమాను ఉన్న పుణ్యభూమి అనంతపురం. కష్టాన్ని నమ్ముకున్న వారు అనంతపురం ప్రజలు. వీరికి మంచిచేస్తే పైకి తీసుకెళ్తారు. తప్పుచేస్తే ఇదే గడ్డపై పాతేసే శక్తి అనంతపురానికి ఉంది. ఇంతటి చరిత్ర ఉన్న అనంతపురం గడ్డపై రెండోసారి పర్యటిస్తుండటం నా అదృష్టంగా భావిస్తున్నా.

ప్రపంచంలో 7 వింతలు ఉన్నాయి. నేడు 8వ వింత వచ్చింది. ప్రిజనరీ జగన్‌కు విజన్ ఉందంటా.. జైలుకు వెళ్లిన వాళ్లకు విజన్ ఉంటుందా? గంజాయిలో, ఇసుక దొబ్బేయడంలో, మద్యంలో అక్రమాలకు పాల్పడటంలో విజన్ ఉంటుంది. గనులు, సెంటుపట్టాలో ఎలా డబ్బులు లేపేయాలో విజన్ ఉన్న వ్యక్తి జగన్ రెడ్డి. మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాట ఆడారు. విశాఖకు మూడు పనులు చేశారు. మొదటిది రూ.500 కోట్ల ఖర్చుతో ప్యాలెస్ కట్టుకున్నాడు. బాత్ రూమ్ కమ్ బోర్డు ఖర్చు రూ.25 లక్షలు. విశాఖలో బస్ షెల్టర్లు కట్టారు. గట్టిగా గాలి వస్తే కూలిపోతున్నాయి. ఫ్లోటింగ్ బ్రిడ్జి కడితే వారంలోనే పోయింది అది. ఇప్పుడు ఏకంగా విశాఖకు పరిశ్రమలు తీసుకువస్తాను, విజన్ ఉందని చెబుతున్నారు. (Nara Lokesh)

ALSO READ: Nara Lokesh: ఓటమి భయంతోనే జగన్ బరితెగింపు చర్యలు!

జగన్‌ది దరిద్రపు పాదం. ఆయన మొదటిసారి వస్తానంటే విశాఖలో ఎల్జీ పాలిమర్స్ లో గ్యాస్ లీకైంది. రెండోసారి ఫ్యాక్టరీలో రియాక్టర్లు పేలిపోయాయి. నిన్నగాక మొన్న బైజూస్ సెంటర్ తగలబడిపోయింది. ఉత్తరాంధ్ర నుంచి ప్రమాణస్వీకారం చేస్తానంటున్నాడు.. ఉత్తరాంధ్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు అంతిమయాత్ర చేయడానికి. గ్రాఫిక్స్ తో కొత్త భవనాన్ని చూపించాడు. అది కోడికత్తి బ్రాండ్. ఒక డిజైన్ చూపించాడు. నేనే ఆశ్చర్యపోయాను. అది సాక్షి ఆఫీసు నుంచి గ్రాఫిక్స్ పంపించారు. కోడికత్తి తప్పితే వారికేం తెలుసు? బాబాయిని లేపేసింది ఎవరు? జగన్ రెడ్డి, అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, పైనున్న ముగ్గురు. నాలుగో ఆప్షన్ కరెక్ట్. ముందు గుండెపోటు అన్నారు. తర్వాత శవానికి కుట్లు వేసి హడావుడిగా అంత్యక్రియలు చేయాలని చూశారు. చంద్రబాబు చేతిలో గొడ్డలిపెట్టి నారాసుర రక్త చరిత్ర అన్నారు.

అబ‌ద్ధం ప్రపంచం చుట్టి తిరిగివచ్చింది. కానీ ఈ రోజు నిజం బయటకు వచ్చింది. సొంత చెల్లి సునీత నిజాలు బయటకు చెప్పారు. హంతకులు పాలకులు అయ్యారని, జగన్ కు ఓటు వేయవద్దని పిలుపునిచ్చారు సునీత. విలువలు, విశ్వసనీయత, మాట తప్పను, మడమ తిప్పను అనే మా అన్నవి అన్నీ అబద్ధాలే అని చెప్పారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉండాలంటే జగన్ ను ఓడించాలని సునీత చెప్పారు. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు సీబీఐ వస్తే జగన్ రెడ్డి అడ్డం పడ్డారని ఆమె చెప్పారు. వీటన్నింటికి జగన్ రెడ్డి సమాధానం చెప్పాలి. వైఎస్ సునిత రెడ్డికి మేం న్యాయం చేస్తాం. ఆమెకు న్యాయం జరగాలి. సొంత తల్లి, చెల్లిని జగన్ రెడ్డి మెడ పట్టుకుని బయటకు గెంటేశారు. సొంత తల్లి, చెల్లికి న్యాయం చేయలేని జగన్ రెడ్డి మనకు న్యాయం చేస్తాడా అని ఆలోచించాలి. సైకో జగన్ అద్భుతమైన కటింగ్, ఫిటింగ్ మాస్టర్. బల్లపైన బులుగు బటన్. బల్ల కింద రెడ్ బటన్. బల్లపైన బటన్ నొట్టి రూ.10 అకౌంట్ లో వేసి రెడ్ బటన్ తో 100 లాగేస్తారు. (Nara Lokesh)

కరెంట్ ఛార్జీలు 9 సార్లు పెంచి బాదుడే బాదుడు. ఆర్టీసీ ఛార్జీలు మూడు సార్లు పెంచి బాదుడే బాదుడు. పెట్రోల్, డీజిల్ ధరలు, గ్యాస్ ధరలు, క్వార్టర్ బాటిల్, ఇంటి పన్ను, చెత్తపన్ను పెంచి బాదుడే బాదుడు. ఇక కటింగ్ మాస్టర్.. అన్న క్యాంటీన్ కట్, పెళ్లికానుకలు కట్, పండుగ కానుకలు, చంద్రన్న బీమా, డ్రిప్ ఇరిగేషన్, 6 లక్షల మంది వృద్ధులకు పెన్షన్ కట్. 100 సంక్షేమ పథకాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈ సైకో జగన్ రెడ్డి.

పవనన్న, చంద్రబాబు గారు కలిసి బాబు సూపర్-6 హామీలు ప్రకటించారు. మొదటిది నిరుద్యోగ యువతీ, యువకులకు ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు మనం కల్పిస్తాం. ఉద్యోగాలు వచ్చే వరకు ప్రతి నెల రూ.3వేలు నిరుద్యోగ భృతి కల్పిస్తాం. స్కూల్ కు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ.15వేలు ఇస్తాం. ముగ్గురుంటే రూ.45 వేలు వస్తాయి. ప్రతి రైతుకు ఆర్థిక సాయం కోసం ఏడాదికి రూ.20వేలు మన ప్రభుత్వం ఇస్తుంది. ప్రతి ఇంటింకి ఏడాదికి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తాం. మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మన ప్రభుత్వం కల్పిస్తుంది.

ఇక 18 నుంచి 59 ఏళ్ల మహిళలకు నెలకు రూ.1500 చొప్పున ఏడాదికి రూ.18వేలు, ఐదేళ్లలో రూ.90 వేలు ఇస్తాం. జగన్ ను నేను సూటిగా ప్రశ్నిస్తున్నా.. ఎన్నికలకు ముందు బీసీలు బ్యాక్ వర్డ్ క్లాస్ కాదు.. బ్యాక్ బోన్ క్లాస్ అన్నారు. ఇప్పుడు ఏకంగా బీసీల బ్యాక్ బోన్ విరగ్గొట్టాడు ఈ సైకో జగన్. 26వేల మంది బీసీలపై దొంగ కేసులు పెట్టారు, 300 మంది బీసీలను హత్య చేశారు. ఇదేనా బీసీలకు ఇచ్చే గౌరవం? రెండు నెలలు ఓపిక పట్టండి… బీసీలపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేస్తాం.

ALSO READ: TDP BJP Janasena: పొత్తు ఖ‌రారు.. ఎవ‌రికి ఎన్ని సీట్లంటే..!?

అమర్ నాథ్ గౌడ్, నందం సుబ్బయ్య, చంద్రయ్య, జల్లయ్య లాంటి అనేక మంది బీసీలను ఈ ప్రభుత్వం హత్య చేసింది. బీసీలకు రావాల్సిన రూ.75వేల కోట్ల సబ్ ప్లాన్ నిధులు దారిమళ్లించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 10శాతం రిజర్వేషన్లు తగ్గించారు. బీసీ సోదరుల గొంతు విన్నాం. అందుకే బీసీ డిక్లరేషన్ ప్రకటించాం.50 ఏళ్లు నిండిన బీసీలకు నెలకు రూ.4వేలు పెన్షన్ అందించబోతోంది మన ప్రభుత్వం. బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం ఏర్పాటుచేస్తాం. బీసీలకు సబ్ ప్లాన్ కింద ఐదేళ్లలో లక్షా 50వేల కోట్లు మన ప్రభుత్వం ఖర్చుపెడుతుంది. (Nara Lokesh)

స్వయం ఉపాధి కోసం ఐదేళ్లలో 10వేల కోట్ల రూపాయలు ఖర్చుపెడతాం. ఆదరణ పథకం కింద 5వేలు కోట్లు ఖర్చు పెట్టి పనిముట్లు అందిస్తుంది మన ప్రభుత్వం. చంద్రన్న బీమా కింద రూ.10 లక్షలు, బీసీ సోదరుల ఇంట్లో పెళ్లి జరిగితే పెళ్లి కానుక కింద లక్ష రూపాయలు, బీసీ సోదరులకు పర్మినెంట్ క్యాస్ట్ సర్టిఫికెట్లు కూడా మన ప్రభుత్వం ఇస్తుంది. ఆనాడు కమ్యూనిటి భవనాల పనులు ప్రారంభించాం. ఇప్పుడు ఆగిపోయాయి. మన ప్రభుత్వ ఏర్పడిన మొదటి రెండు సంవత్సరాల్లో పూర్తిచేస్తాం.

అనంతపురం జిల్లా ప్రజలు విశ్వవిఖ్యాత ఎన్టీఆర్ గారి దగ్గరి నుంచి చంద్రబాబు గారి వరకు ఎంతో ప్రేమ చూపిచారు, అందుకే టీడీపీ ఐదేళ్ల పాలనలో చంద్రబాబు ఎంతో అభివృద్ధి చేశారు. కరవు జిల్లాలో ఏకంగా కార్లు తయారుచేసే పరిశ్రమ తీసుకువచ్చిన విజనరీ చంద్రబాబునాయుడు. కియా అనుబంధ సంస్థల ద్వారా50 వేల మందికి ఉద్యోగాలు వచ్చే కల్పించారు. ఐదేళ్లలో లక్షా 30వేల మంది రైతులకు 90 శాతం సబ్సీడీ ద్వారా డ్రిప్ ఇరిగేషన్ కూడా అందించాం. అనంతను హార్టికల్చర్ హబ్ గా తీర్చిదిద్దాం.

కరవు వస్తే రైతులను ఆదుకునేందుకు ట్యాంకర్ల ద్వారా నీరు అందించి పంటలను కాపాడాం. ఒకే సంవత్సరం ఇన్ పుట్ సబ్సీడీ ద్వారా రూ.2వేల కోట్లు రైతులకు అందజేశాం. జిల్లాలో రోడ్లు, బ్రిడ్జిలు వచ్చాయంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ. హంద్రీ-నీవా ప్రాజెక్టు ఫేజ్-2, హెచ్ఎల్ సీ హైలెవన్ మెయిన్ కెనాల్, మిడ్ పెన్నా సౌత్ కెనాల్, గుంతకల్లు బ్రాంచ్ కెనాల్, ధర్మవరం బ్రాంచ్ కెనాల్ పనులు చేసింది మన పార్టీ తెలుగుదేశం పార్టీ.

2019లో పాలిచ్చే ఆవును కాదని తన్నే దున్నపోతును తెచ్చుకున్నారు. అనంతపురం జీవనాడిగా ఉన్న డ్రిప్ ఇరిగిషేన్ పథకాన్ని రద్దు చేశాడు ఈ సైకో జగన్. 50 ఏళ్లలో ఎప్పుడూ చూడని కరవు అనంతపురం జిల్లాలో ఉంది. అలాంటి దరిద్రపు పాదం ఈ జగన్ రెడ్డిది. రైతులకు కనీసం ఇన్ పుట్ సబ్సీడీ ఇవ్వడానికి కూడా చేతులు రాలేదు. పట్టు రైతులను ఆదుకుంటానని హామీ ఇచ్చిన జగన్ రెడ్డి గాలికి వదిలేశాడు. రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటుచేస్తామని చెప్పి ఒక్క రూపాయి ఇవ్వలేదు. పండించిన పంటలకు గిట్టుబాటు ధర కూడా లేదు. బాబు సూపర్ సిక్స్ హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఈ సందర్భంగా కోరుతున్నా. బాగా పనిచేసిన వారి దగ్గరకి నేనే వెతుక్కుంటూ వచ్చి నామినేటెడ్ పదువులు ఇస్తాం.