Chandrababu Naidu: జ‌గ‌న్ అనే భూతాన్ని శాశ్వ‌తంగా రాజ‌కీయ స‌మాధి చేస్తాం

We are going to completely bury that ghost politically very soon

Chandrababu Naidu: చాలా మంది పెట్టుబ‌డిదారులు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అడుగుపెట్టాల‌న్నా పెట్టుబ‌డులు పెట్టాల‌న్నా భయపడుతున్నారని అన్నారు రాష్ట్ర ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్‌లో ఒక భూతం ఉందని భవిష్యత్తులో ఆ భూతం మళ్ళి వస్తే మా పరిస్థితి ఏంటి అని పెట్టుబ‌డిదారులు ఆందోళ‌న చెందుతున్నార‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. వాళ్లందరికీ ఒకటే హామి ఇస్తున్నాన‌ని.. ఆ భూతాన్ని త్వరలోనే పూర్తిగా రాజకీయ సమాధి చేయబోతున్నామ‌ని చంద్ర‌బాబు ప‌రోక్షంగా జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై కౌంట‌ర్ వేసారు.