EXCLUSIVE: ఎన్నిక‌ల బ‌రిలో వివేకా భార్య‌?

EXCLUSIVE: దివంగ‌త నేత వైఎస్ వివేకానంద రెడ్డి (ys vivekananda reddy) స‌తీమ‌ణి వైఎస్ సౌభాగ్య (ys sowbhagya) ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల (ap elections) బ‌రిలో దిగ‌నున్న‌ట్లు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. పులివెందుల (pulivendula)  బ‌రిలో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి (jagan mohan reddy) వ్య‌తిరేకంగా సౌభాగ్య పోటీ చేస్తార‌ని తెలుస్తోంది.

ఇప్పుడు ఏపీ కాంగ్రెస్ అధ్య‌క్షురాలి ప‌ద‌విలో వైఎస్ షర్మిళ (ys sharmila) ఉన్నారు. కాబ‌ట్టి భ‌ర్త‌ను కోల్పోయి పుట్టెడు దుఖంలో ఉన్న పిన్నిని అక్కున చేర్చుకుని పులివెందుల సీటు క‌ల్పించే యోచ‌న‌లో షర్మిళ ఉన్న‌ట్లు తెలుస్తోంది. కొంద‌రు కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌లు కూడా ఈ ఆలోచ‌న‌లో ఉన్నారు. వివేకా చ‌నిపోయిన నేప‌థ్యంలో ఆ సానుభూతితో అయినా సౌభాగ్య‌కు ఓట్లు ప‌డ‌తాయ‌ని అనుకుంటున్నారు. ఆ దిశ‌గా మెల్లిగా సోద‌రి ష‌ర్మిళ‌తో వివేకా కూతురు సునీతా రెడ్డి చ‌ర్చ‌లు జ‌రుపుతున్న‌ట్లు తెలుస్తోంది. ఇందుకోసం వివేకా అభిమానులు ఇప్ప‌టినుంచే ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్నారు. దీనిపై మ‌రిన్ని వివ‌రాలు క్లుప్తంగా తెలియాల్సి ఉంది.