Vijayasai Reddy: గుర్తుపెట్టుకో.. వంద‌సార్లు అత‌ని పేరు క‌ల‌వ‌రిస్తావ్

Vijayasai Reddy: వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి ఖలీల్ అహ్మద్ ఎవరో కూడా తెలియదన్నావు చూడు… అదే మాట మీద ఉండు అని తెలుగు దేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడుకు స‌వాల్ విసిరారు ఎంపీ విజ‌య సాయిరెడ్డి. త‌న‌కు ఖ‌లీల్ అహ్మ‌ద్ ఎవ‌రో తెలీద‌ని చంద్ర‌బాబు నాయుడు అన‌డం ప‌ట్ల విజయ సాయి రెడ్డి మండిప‌డ్డారు.

“” నారాయణా! మీకు వేల కోట్ల డబ్బు ఉండొచ్చు. అంతకు మించిన అహంకారం నిండా ఆవరించి ఉంది. మీపై పోటీ చేసే వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి ఖలీల్ అహ్మద్ ఎవరో కూడా తెలియదన్నావు చూడు. అదే మాట మీద ఉండు. రెండు వారాలైతే రోజుకు వందసార్లు కలవరిస్తావు ఖలీల్ గారి పేరును. ఎన్నికల కౌంటింగ్ రోజున ఇంత భారీ మెజారిటీతో గెలిచాడా అని నోరెళ్లబెడతావు. పీడకలలు కంటావు. దళితులు, బిసిలు, మైనారిటీలు, పేదలంటే నీకెంత అసహ్యమో ఖలీల్ ఎవరో తెలియదు అనడాన్ని బట్టి అర్థమవుతోంది. విజ్ఞులైన నెల్లూరు ప్రజలు మీకు గుణపాఠం చెప్పకుండా వదలరు. ఈ ఎలక్షన్‌తో మీ రాజకీయ చరిత్ర ముగుస్తుంది “” అని వార్నింగ్ ఇచ్చారు.