Vijaya Sai Reddy: మీ పుట్టుకపై అనుమానం ఉంది.. డీఎన్ఏ టెస్ట్ చేయించుకోండి

Vijaya Sai Reddy warns tdp and ysrcp leaders who is doing wrong allegations on him

Vijaya Sai Reddy:  త‌న‌పై త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేస్తున్న తెలుగు దేశం పార్టీ నేత‌ల‌పై మండిప‌డ్డారు వైఎస్సార్ కాంగ్రెస్ నేత విజ‌య సాయి రెడ్డి. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చెందిన దేవాదాయ శాఖ అసిస్టెంట్ క‌మిష‌న‌ర్ శాంతి కుమారి విజ‌య సాయిరెడ్డి ద్వారా బిడ్డ‌కు జ‌న్మ‌నివ్వ‌బోతున్నార‌ని ఆమె భ‌ర్త షాకింగ్ వ్యాఖ్య‌లు చేసారు. తాను ఎంతో కాలంగా దుబాయ్‌లో ఉంటూ ఉద్యోగం చేసుకుంటూ ఉంటే.. శాంతి కుమారి గ‌ర్భం ఎలా దాల్చిందో విచార‌ణ చేప‌ట్టాల‌ని ఆదేశించారు. ఈ నేప‌థ్యంలో దేవాదాయ శాఖ క‌మిష‌న‌ర్ శాంతి కుమారిని స‌స్పెండ్ చేసారు.

ఈ నేప‌థ్యంలో శాంతి కుమారి త‌న‌పై భ‌ర్త వేస్తున్న ఆరోప‌ణ‌ల‌ను ఖండించారు. త‌నపై ఆరోప‌ణ‌లు చేస్తున్న మ‌ద‌న్ మోహన్ త‌న మొద‌టి భ‌ర్త అని అత‌నితో 2016లో విడిపోయి 2020లో సుభాష్ అనే వ్య‌క్తిని వివాహం చేసుకున్నాన‌ని.. అత‌ని ద్వారానే తాను గ‌ర్భం దాల్చాన‌ని అన్నారు. ఇందులో విజ‌య‌సాయి రెడ్డితో తన‌కు లైంగిక సంబంధం ఉంద‌ని వ‌స్తున్న వార్త‌లు అన్నీ ప‌చ్చి అబ‌ద్ధాలంటూ మీడియా ముందు బోరున విల‌పించారు.

దీనిపై విజ‌య సాయిరెడ్డి స్పందిస్తూ.. ఇలాంటి ద‌రిద్ర‌పు నింద‌లు మోపితే అది తెలుగు దేశం పార్టీ నేత‌లైనా వైఎస్సార్ కాంగ్రెస్ నేత‌ల‌నైనా వ‌దిలే ప్ర‌సక్తే లేద‌ని హెచ్చ‌రించారు. నిన్న త‌న ఇంటి ద‌గ్గ‌రికి ఓ వ్య‌క్తి బైక్‌పై మ‌రో మ‌హిళ‌ను వేసుకుని వ‌చ్చి విజ‌య‌సాయి రెడ్డి గాడు పారిపోయాడా అని అడిగిన‌ట్లు త‌న‌కు తెలిసిందని.. వాడెవ‌డో ఎక్క‌డి నుంచి వ‌చ్చాడో మాత్రం త‌న‌కు తెలీద‌ని విజ‌య సాయి అన్నారు. అత‌ను క‌చ్చితంగా తెలుగు దేశం పార్టీకి చెందిన గూండానే అని.. మీడియా ముందు వాడికి ఎక్క‌డైనా వ‌స్తా చూసుకుందాం అని స‌వాల్ చేస్తున్నాన‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేసారు. ఇక త‌న గురించి త‌ప్పుగా రాస్తున్న మూడు మీడియా ఛానెళ్ల ఎండీల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసారు. వారి పుట్టుక‌ల‌పై అనుమానం ఉంద‌ని.. వారికి డీఎన్ఏ టెస్ట్ చేయించాల్సిందేన‌ని విజ‌య సాయి మండిపడ్డారు.